బడ్జెట్ 2024: ప్రభుత్వం రాయితీలను పెంచడం ద్వారా NPSని మరింత ఆకర్షణీయంగా..

By Ashok kumar SandraFirst Published Jan 24, 2024, 11:08 AM IST
Highlights

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఎంప్లాయర్ల  కంట్రిబ్యూషన్‌ల కోసం పన్ను విషయంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ (EPFO)తో సమానత్వాన్ని కోరింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.  
 

75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు విరాళాలు(contributions) ఇంకా  ఉపసంహరణల(withdrawals)పై పన్ను రాయితీలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ని మరింత ఆకర్షణీయంగా ఈసారి  మార్చవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) యజమానుల కంట్రిబ్యూషన్‌ల కోసం పన్ను విషయంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ (EPFO)తో సమానత్వాన్ని కోరింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆమెకి ఈ బడ్జెట్ ఆరో బడ్జెట్‌.

 ప్రస్తుతం NPSకి ఎంప్లాయర్ సహకారంలో అసమానత ఉంది. ప్రాథమిక జీతం ఇంకా  డియర్‌నెస్ అలవెన్స్‌లో 10 శాతం వరకు NPSకి కార్పొరేట్ విరాళాలు పన్ను నుండి మినహాయించబడ్డాయి. అయితే  ఈపీఎఫ్‌ఓ విషయంలో ఇది 12 శాతం.

Latest Videos

వార్షిక కంట్రిబ్యూషన్‌ను పన్ను రహితంగా చేయాలని డిమాండ: NPS ద్వారా దీర్ఘకాలిక పొదుపులను ప్రోత్సహించడానికి వడ్డీ ఇంకా  పెన్షన్‌తో దీన్ని చేర్చవచ్చని డెలాయిట్ తెలిపింది. అలాగే, పన్ను భారాన్ని తగ్గించడానికి, NPS   వార్షిక సహకారం 75 సంవత్సరాల వయస్సు   హోల్డర్లకు పన్ను రహితంగా చేయాలి.

 కొత్త పన్ను విధానంలో ఎన్‌పిఎస్ కంట్రిబ్యూషన్‌లపై  ఉపశమనం కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుతం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (1B) ప్రకారం, NPSలో రూ. 50,000 వరకు కంట్రిబ్యూషన్ పాత సిస్టమ్ నుండి మినహాయించబడింది. కొత్త పన్ను విధానంలో ఈ నిబంధన లేదు.

భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల జిడిపిగా మారే లక్ష్యాన్ని సాధిస్తుంది: డెలాయిట్ సర్వే భారత పరిశ్రమ మౌలిక సదుపాయాలపై కేంద్ర పెట్టుబడులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం ఇంకా అదనపు సంస్కరణల ఆధారంగా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తుందని భారతీయ పరిశ్రమ నమ్మకంగా ఉంది.  Deloitte Touche Tohmatsu India LLP  CXO సర్వే ప్రకారం, పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలమైన ఆర్థిక వృద్ధిని ఆశిస్తోంది. 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని 50 శాతం మంది వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారు. 2024-25 మధ్యకాలంలో పరిశ్రమలలో, వినియోగదారు అండ్  రిటైల్ రంగాల వృద్ధి రేటు అత్యధికంగా 66 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది. దేశ ఆటోమొబైల్ రంగం 50 శాతం వేగంతో వృద్ధి చెందుతుంది. టెక్నాలజీ-టెలికామ్‌లో 47 శాతం, ఇంధన వనరుల రంగంలో 44 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నారు. 

click me!