
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. తాజాగా ఆదివారం (మార్చి 6, 2022)న దేశంలో 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ. 760కిపైగా ఎగబాకింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,220గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800గా ఉంది.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,800గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
ఇక వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.70,000 ఉండగా, ఆర్థిక రాజధాని ముంబైలో రూ.70,000 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, కోల్కతాలో రూ.70,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, కేరళలో రూ.73,400 ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.