
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఇక తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం (మార్చి 1, 2022)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,28గా0 ఉంది.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.
వెండి ధరలు
మరో వైపు దేశీయంగా వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,200 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,200 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,900 ఉండగా, కోల్కతాలో రూ.65,200 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర 69,900 ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 69,900 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా వెండి ధర రూ. 69,900గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.