మండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు.. నేడు మళ్ళీ పెంపు.. లీటరు ఎంతంటే ?

Published : Feb 09, 2021, 11:57 AM IST
మండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు.. నేడు మళ్ళీ పెంపు.. లీటరు ఎంతంటే  ?

సారాంశం

లీటర్  డీజిల్  ధరపై 35 పైసలు పెరగగా, పెట్రోల్ ధర పై 34 నుంచి 35 పైసలకు పెరిగింది. దీంతో ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.    

పెట్రోల్, డీజిల్ ధరలను నేడు మళ్ళీ రాష్ట్ర చమురు కంపెనీలు పెంచాయి. లీటర్  డీజిల్  ధరపై 35 పైసలు పెరగగా, పెట్రోల్ ధర పై 34 నుంచి 35 పైసలకు పెరిగింది. దీంతో ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.  

చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) పెట్రోల్ ధర పై 35 పైసలు  పెంచడంతో  లీటరు ధర రూ.87.30  పెరిగి మంగళవారం దేశ రాజధానిలో పెట్రోల్ ధర  సరికొత్త రికార్డును తాకింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధర కూడా లీటరుకు 35 పైసలు పెరిగింది, దీంతో డీజిల్ లీటరుకు రూ.77.48 వద్ద అమ్ముడవుతుంది.

ఇంధన ధరలు ముంబైలో రికార్డు స్థాయిలో పెట్రోల్ లీటరుకు రూ.93.83, డీజిల్ లీటరుకు. 84.36 వద్ద చేరాయి.

also read నాలుగు సార్లు ప్రేమ, కానీ పెళ్లి చేసుకోలేదు.. రతన్ టాటా గురించి ఆశ్చర్యకరమైన విషయాలు.. ...


మెట్రో       పెట్రోల్        డీజిల్  

ఢీల్లీ -         87.30            77.48

ముంబై -   93.83              84.36

కోల్టాటా -   88.63              81.06

చెన్నై -     89.70              82.66


పెట్రోల్, డీజిల్ ధరలను అంతర్జాతీయ ధర ఇంకా విదేశీ మారకపు రేట్లకు అనుగుణంగా ప్రతిరోజుసవరించబడతాయి.కోవిడ్-19 టీకాలు అమల్లోకి వచ్చినప్పుడు పెట్టుబడిదారులు చమురు డిమాండ్ రికవరీపై ఆశలు పెట్టుకుంటున్నారు. బలహీనమైన డాలర్ కూడా  ధరలను పెంచడానికి సహాయపడింది.

ప్రతిరోజూ  ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సావరిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

మీ నగరంలో  పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోండి, మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్‌ఎస్‌పి, మీ సిటీ కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు  ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు