IPO ద్వారా డబ్బులు సంపాదించే చాన్స్, రేపటి నుంచి Electronics Mart IPO ప్రారంభం, మినిమం ఎంత డబ్బు పెట్టాలంటే..

Published : Oct 03, 2022, 04:47 PM IST
IPO ద్వారా డబ్బులు సంపాదించే చాన్స్, రేపటి నుంచి Electronics Mart IPO ప్రారంభం, మినిమం ఎంత డబ్బు పెట్టాలంటే..

సారాంశం

స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా లాభాలు పొందాలనుకుంటున్నారా, అయితే సరికొత్త ఐపీఓగా కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ మార్కెట్లోకి రానుంది. రేపటి నుంచి ఈ ఐపీవో పెట్టుబడుల కోసం తెరుచుకోనుంది. ఈ నెల 7వ తేదీ వరకూ పెట్టుబడులు పెట్టే వీలుంది.

స్టాక్ మార్కెట్లో ఐపీవోలు ఒక్కోసారి బంగారు బాతులుగా మారుతుంటాయి. మీరు పెట్టిన డబ్బును లిస్టింగ్ రోజే ప్రీమియం లాభాల ద్వారా మీ పంట పండిస్తుంటాయి. తాజాగా లిస్ట్ అయిన రెండు ఐపీవోలను పరిశీలిస్తే  Syrma SGS ఐపీవో 41.1 శాతం లాభాలను అందించింది. DreamFolks Services ఐపీవో సైతం 40.3 శాతం లాభాలను అందించింది. దీంతో మరోసారి ఐపీవో మార్కెట్లో కళ వచ్చింది.  

ప్రస్తుతం  కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ IPO మార్కెట్లోకి రానుంది. దీని ధర బ్యాండ్ రూ.56 నుండి రూ.59గా నిర్ణయించారు. IPO పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 4న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకొని, అక్టోబర్ 7న ముగుస్తుంది. అని కంపెనీ తెలిపింది. ఇది 70 భారతీయ, విదేశీ బ్రాండ్‌లలో విస్తరించి ఉన్న కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్‌లో 6,000 కంటే ఎక్కువ స్టాక్ కీపింగ్ యూనిట్లను (SKUs) నిల్వ చేస్తుంది. 

యాంకర్ ఇన్వెస్టర్లు అక్టోబర్ 3న బిడ్లను సమర్పించవచ్చు. అక్టోబరు 12న షేర్ల అలాట్ మెంట్ జరుగుతాయి. అక్టోబర్ 14న క్రెడిట్ షేర్ చేయబడుతుంది. ఈ షేర్లు అక్టోబర్ 17న మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.

ఈ ఇష్యూ కింద, ఎలక్ట్రానిక్స్ మార్ట్ IPO పెట్టుబడిదారుల నుంచి రూ. 500 కోట్ల ను సేకరించనుంది.  ఈ షేర్ నుంచి వసూలు చేసిన మొత్తం రూ. 111.44 కోట్లు మూలధన వ్యయంలో వినియోగించబడింది, రూ. 220 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించనున్నారు, రూ. 55 కోట్లు అప్పు తీర్చేందుకు వినియోగిస్తారు. ఆగస్టు 2022 నాటికి, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలు రూ. 919.58 కోట్లు  జూన్ 2022 వరకు నికర విలువ రూ. 446.54 కోట్లు. ఇష్యూకి లీడ్ మేనేజర్లుగా ఆనంద్ రాఠి అడ్వైజర్స్, IIFL సెక్యూరిటీస్, JM ఫైనాన్షియల్ వ్యవహరించనున్నారు. .

కంపెనీకి ఎలాంటి ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి?
ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్‌ను 1990లో పవన్ బజాజ్, కరణ్ బజాజ్ స్థాపించారు. 36 నగరాలు, పట్టణాలలో 112 కంపెనీ స్టోర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లలో కంపెనీకి అత్యధిక సంఖ్యలో స్టోర్‌లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2021-22 కార్యకలాపాల నుండి రూ. 4,349.32 కోట్ల ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,201.88 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ కాలంలో నికర లాభం రూ. 104.89 తగ్గి రూ. 40.65 కోట్లుగా ఉంది. 

బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌తో పాటు, కంపెనీ రెండు ప్రత్యేకమైన రిటైల్ బ్రాండ్‌లను కూడా సృష్టించింది. ఎయిర్ కండీషనర్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వినియోగదారుల ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తుంది. దరఖాస్తు కోసం కనీస లాట్ పరిమాణం 254 షేర్లు. ఈ విధంగా రిటైల్ షేర్లు కనీసం 1 లాట్ 254 షేర్లు  గరిష్టంగా 13 లాట్‌ల 3,302 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ ఐపీవోలు కనీస పెట్టుబడి 254 షేర్ల లాట్ కోసం రూ. 14,224 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

LPG Price Hike : మళ్లీ పెరగనున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు? అసలు కారణం ఇదే
Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి