ఇకపై విమాన ప్రయాణానికి బోర్డింగ్ పాస్ అవసరం లేదు, Digi Yatra సర్వీసుతో క్షణాల్లో విమానం ఎక్కే అవకాశం..

Published : Dec 02, 2022, 01:47 PM IST
ఇకపై విమాన ప్రయాణానికి బోర్డింగ్ పాస్ అవసరం లేదు,  Digi Yatra సర్వీసుతో క్షణాల్లో విమానం ఎక్కే అవకాశం..

సారాంశం

డిసెంబర్ 1 నుంచి విమాన ప్రయాణం మరింత సౌకర్యం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విమానాశ్రయాలలో పేపర్‌లెస్ ఎంట్రీని ప్రవేశపెట్టింది. విమానాశ్రయాల్లో ఎంట్రీ  కోసం ఇకపై బోర్డింగ్ పాసులతో పని లేకుండా "డిజి యాత్ర" అనే ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను వాడనున్నారు. దీంతో విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ప్రయాణికులు తమ ఐడీ కార్డు, బోర్డింగ్ పాస్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా  దేశ రాజధానిలో డిజి యాత్రను ప్రారంభించారు. 

Digi Yatra: విమాన ప్రయాణీకుల ప్రయాణం ఇప్పుడు మరింత హైటెక్, డిజిటల్‌గా మారనుంది. డిసెంబర్ 1 నుంచి డిజి యాత్ర యాప్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించింది. తొలి దశలో ఢిల్లీ, బెంగళూరు, వారణాసి నుంచి ప్రారంభిస్తారు. రెండో దశ విజయవాడ, హైదరాబాద్, కోల్‌కతా, పుణెలలో మార్చి 2023లో ప్రారంభమవుతుంది. మూడవ దశలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. చెక్-ఇన్ నుండి బోర్డింగ్ వరకు ప్రక్రియను సులభమైన, వేగవంతమైన, సురక్షితంగానూ, డాక్యుమెంట్ లేకుండా చేయడం దీని లక్ష్యంగా ఉంది. 

డిజి యాత్ర యాప్ అంటే ఏమిటి?

డిజి యాత్ర (Digi Yatra) యాప్ అనేది మొబైల్ వాలెట్ ఆధారిత గుర్తింపు ప్లాట్ ఫాం. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోని అన్ని చెక్ పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా డిజిటల్ ఎంట్రీ లభిస్తుంది.  ఈ యాప్ గోప్యత, డేటా రక్షణ పరంగా చాలా సురక్షితం. డిజి యాత్ర ఫౌండేషన్ (DYF) ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇందులో 26% ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధీనంలో ఉంది . 74% బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్ల వద్ద ఉంది.

డిజి యాత్ర (Digi Yatra)ను ఎలా ఉపయోగించాలి?

>> Digi Yatra యాప్‌ను ఉపయోగించడానికి, మీరు ముందుగా దాన్ని Google Play Store లేదా Apple Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

>> ఆపై మొత్తం సమాచారాన్ని నింపిన తర్వాత మీరు దానిని ఆధార్‌తో లింక్ చేయాలి.

>> తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.

>>  మీరు ప్రయాణం చేసినప్పుడు యాప్‌లో మీ విమాన టిక్కెట్‌ను అప్‌లోడ్ చేయండి.

>> విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, మీరు యాప్‌ను స్కానర్‌లో ఉంచాలి. ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే మీకు విమానాశ్రయంలో ప్రవేశం లభిస్తుంది.

>> దీని తర్వాత మీ ముఖం సెక్యూరిటీ చెకింగ్, బోర్డింగ్ సమయంలో మాత్రమే స్కాన్ చేయబడుతుంది.

డిజి యాత్ర (Digi Yatra)  ఉద్దేశం ఏమిటి?

డిజి యాత్ర (Digi Yatra)  యాప్ ద్వారా విమానాశ్రయం చెక్-ఇన్ వేగవంతం చేయబడుతుంది మరియు ప్రయాణీకులు కూడా పొడవైన క్యూల నుండి ఉపశమనం పొందుతారు. దీనితో పాటు, మొత్తం ప్రక్రియ పేపర్‌లెస్‌గా ఉంటుంది మరియు గుర్తింపుకు సంబంధించిన పత్రాలను మళ్లీ మళ్లీ చూపించాల్సిన అవసరం లేదు. ఇది సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ మరియు చెక్-ఇన్ కోసం వ్యవస్థను కూడా కలిగి ఉంది. దీంతో పాటు డిజిటల్‌గా ఉండడం వల్ల ప్రయాణికుల డేటా కూడా సులువుగా లభ్యమవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !