బంగారం కొంటున్నారా.. వరుసగా 3వ రోజు పెరిగిన పసిడి, వెండి.. నేటి ధరలు తెలుసుకొండి..

Published : Dec 02, 2022, 10:42 AM ISTUpdated : Dec 02, 2022, 10:44 AM IST
బంగారం కొంటున్నారా.. వరుసగా 3వ రోజు పెరిగిన పసిడి, వెండి.. నేటి ధరలు తెలుసుకొండి..

సారాంశం

హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,150గా ఉంది. మరోవైపు బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం ఇండియాలో కిలో వెండి ధర రూ. 63,600లుగా ఉంది.

ఇండియాలో బంగారం, వెండి ధరలు గత వారం నుంచి ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గురువారం నాడు బంగారం ధర నిలకడగా ఉండగా నేడు బంగారం ధర పెరగడంతో పాటు వెండి ధర కూడా ఎగిసింది.

ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,750, 24 క్యారెట్ల ధర రూ.53,180గా ఉంది. 10 గ్రాముల  వెండి  ధర రూ.636గా ఉంది. 0037 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,800.78 డాలర్ల వద్ద కొద్దిగా మార్పు చెందింది.  US గోల్డ్ ఫ్యూచర్స్ $1,814.60 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.

 SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్, హోల్డింగ్స్ గురువారం 0.16% పడిపోయాయి.స్పాట్ సిల్వర్ 0.5% పడిపోయి $22.26డాలర్లకి, ప్లాటినం 0.2% తగ్గి $1,039.75డాలర్లకి, పల్లాడియం 0.7% నష్టపోయి $1,927.21డాలర్లకి చేరుకుంది.

చెన్నై       రూ.49,550    రూ.54,050
ముంబై     రూ.48,750    రూ.53,180
ఢిల్లీ          రూ.48,900    రూ.53,330
కోల్‌కతా    రూ.48,750    రూ.53,180
బెంగళూరు    రూ.48,800    రూ.53,230
కేరళ        రూ.48,750    రూ.53,180
పూణే        రూ.48,750    రూ.53,180
అహ్మదాబాద్  రూ.48,800    రూ.53,230
జైపూర్      రూ.48,900    రూ.53,330
లక్నో        రూ.48,900    రూ.53,330
మధురై     రూ.49,550    రూ.54,050
విజయవాడ    రూ.48,750    రూ.53,180
పాట్నా      రూ.48,780    రూ.53,230
నాగపూర్         రూ.48,750    రూ.53,180
చండీగఢ్   రూ.48,800    రూ.53,330
విశాఖపట్నం   రూ.48,750    రూ.53,180

హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,150గా ఉంది. 

మరోవైపు బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం ఇండియాలో కిలో వెండి ధర రూ. 63,600లుగా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే కిలో వెండి ధర  రూ. 2,200 వరకు పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 63,600గా ఉండగా, చెన్నైలో రూ.69,800లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,800గా ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,800గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 69,800ల వద్ద కొనసాగుతోంది. 

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారానికి చెందినవి.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా విక్రయిస్తారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !