Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...575 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్...

Published : Apr 07, 2022, 03:59 PM IST
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...575 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్...

సారాంశం

Stock Market: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ ఎంపీసీ భేటీ కానున్న నేపథ్యంలో మదుపరులు అమ్మకాలక మొగ్గు చూపారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోని నష్టాల ఒత్తిడి కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. 

రేపటి ఆర్‌బిఐ పాలసీ ఫలితాలకు ముందు గురువారం బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాల్లో ముగిశాయి. ముగింపులో సెన్సెక్స్ 575.46 పాయింట్లు  క్షీణించి 59,034.95 వద్ద ముగియగా, నిఫ్టీ 168.20 పాయింట్లు  క్షీణించి 17,639.50 వద్ద  ముగిసింది. దాదాపు 1678 షేర్లు పురోగమించాయి, 1644 షేర్లు క్షీణించాయి మరియు 102 షేర్లు మారలేదు.

నిఫ్టీ టాప్‌ లూజర్స్ లో  అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి, పవర్ గ్రిడ్ కార్ప్, ఒఎన్‌జిసి ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, హెచ్‌యుఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas: లైఫ్ సెటిల్ అయ్యే బిజినెస్‌.. పేప‌ర్ ఎగ్ ట్రే త‌యారీతో ఉన్న ఊరిలోనే లక్షలు సంపాదించ‌వ‌చ్చు
Car Tips: కారు వేగంగా ఉన్న‌ప్పుడు బ్రేక్ ప‌డ‌క‌పోతే ఏం చేయాలో తెలుసా.? అస్స‌లు టెన్ష‌న్ ప‌డ‌కండి