పిల్లలకు కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వొచా..? వయస్సుకి సంబంధించిన నియమాలను తెలుసుకోండి..

By S Ashok KumarFirst Published Jan 4, 2021, 6:03 PM IST
Highlights

కోవాక్సిన్ ఇప్పుడు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై పరీక్ష కోసం కూడా ఆమోదించబడింది. సీరం ఇన్స్టిట్యూట్ యొక్క కోవిషీల్డ్ 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఇవ్వనున్నారు. 

భారత్ బయోటెక్ చెందిన కరోనా వ్యాక్సిన్ 'కోవాక్సిన్' ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆదివారం అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించింది. అలాగే కోవాక్సిన్ ఇప్పుడు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై పరీక్ష కోసం కూడా ఆమోదించబడింది.

సీరం ఇన్స్టిట్యూట్ యొక్క కోవిషీల్డ్ 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఇవ్వనున్నారు. రెండవ దశలలో భారత్ బయోటెక్ 'కోవాక్సిన్' ను 12-18 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ టీకాను ప్రయత్నించారు.

దీని ఆధారంగా క్లినికల్ ట్రయల్ మోడ్‌లో అత్యవసర పరిస్థితిలో వ్యాక్సిన్‌ను పరిమితం చేయడానికి డిసిజిఐ  ఆమోదించింది. అయితే, ప్రస్తుతం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రభుత్వ ప్రాధాన్యత, కానీ ఇందులో పిల్లలను చేర్చలేదు.

also read తప్పుడు సమాచారం, కథనాలు నమ్మోద్దు.. పంజాబ్, హర్యానా రైతుల ఆందోళనపై రిలయన్స్ క్లారీటి..

18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కోవిషీల్డ్ వాక్సిన్
 భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించిన రెండు వ్యాక్సిన్లలో కోవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది, దీనిని ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. కాగా, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన స్వదేశీ కోవాక్సిన్ 12 ఏళ్లు లేదా 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం త్వరలో భారతదేశంలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఒక కార్యక్రమంలో తెలిపారు. కరోనా వాక్సిన్ తయారీకి కృషి చేసిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు ప్రధాని  ధన్యవాదాలు తేలిపారు.

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రస్తావిస్తూ ప్రపంచంలోని ప్రతి మూలలో భారతీయ ఉత్పత్తుల కోసం ప్రతి వినియోగదారుడి హృదయాన్ని మనం గెలుచుకోవాలని అలాగే విశ్వసనీయత, నాణ్యత ఆధారంగా బ్రాండ్ ఇండియాను బలోపేతం చేయాల్సి ఉందని ప్రధాని అన్నారు. నేటి భారతదేశం పర్యావరణ సమస్యలపై ప్రపంచ లీడర్ గా ఎదగడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 

click me!