బెంగళూరు ఏరో ఇండియా 2023లో అద్భుతం, సోలార్ పవర్‌తో ఎగిరే డ్రోన్ ప్రదర్శన, డ్రోన్ గురించి షాకింగ్ నిజాలు ఇవే..

By Krishna AdithyaFirst Published Feb 16, 2023, 12:37 AM IST
Highlights

దేశ భద్రతలో 'సూరజ్' డ్రోన్ పాత్ర పోషిస్తుందని డ్రోన్ స్టార్టప్ గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అగ్నీశ్వర్ జయప్రకాష్ చెప్పారు. ఇది ఆగస్ట్ 2023 నాటికి పూర్తి స్థాయిలో ఎగరడానికి సిద్ధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

డ్రోన్ స్టార్టప్ గరుడ ఏరోస్పేస్ బుధవారం బెంగళూరులోని ఏరో ఇండియా 2023లో సౌరశక్తితో నడిచే డ్రోన్ 'సూరాజ్'ని ఆవిష్కరించింది.ఈ డ్రోన్ ప్రధానం సర్విలెన్స్ పనులకు, సరిహద్దుల పహారాకు ఎక్కువగా వినియోగించనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, మాజీ DRDO చీఫ్ డాక్టర్ సతీష్ రెడ్డి ఈ డ్రోన్‌ను ఆవిష్కరించారు.  కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ డ్రోన్ చాలా ప్రత్యేకమైనది. దీని సహాయంతో, సరిహద్దులో పర్యవేక్షణ సులభం అవుతుందని తెలిపింది.  

సోలార్ డ్రోన్ ప్రత్యేక ఫీచర్లు ఇవే..
>> గరుడ ఏరోస్పేస్ ప్రకారం, 'సూరజ్'ని ISR అంటే ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్యం (ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్యం)లో ఉపయోగించవచ్చు.
>> ఈ డ్రోన్ 3,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఇది ప్రధానంగా నిఘా కోసం రూపొందించారు.
>> ఈ డ్రోన్‌ 12 గంటల పాటు నిరంతరం ఎగరగలదు.
>> ఈ డ్రోన్ ఆకాశం నుంచి సమాచారాన్ని సేకరించి నేలపై ఉన్న సైనికులకు పంపించి వారి భద్రతకు ఉపయోగపడుతుంది.
>> డ్రోన్‌కు జె ఆకారంలో రెక్కలు ఉన్నాయి. ఇది సూర్యకాంతితో నడిచే సెల్‌ను కలిగి ఉంటుంది. ఇదే దీని ప్రాథమిక ఇంధనంగా పనిచేస్తుంది.
>> ఈ డ్రోన్‌లో అదనపు బ్యాటరీని కూడా ఉపయోగించారు, ఇది అవసరానికి అనుగుణంగా డ్రోన్ వేగాన్ని నిర్వహించడానికి పనిచేస్తుంది.
>> 'SURAJ' డ్రోన్‌లో అధిక రిజల్యూషన్ కెమెరాతో పాటు థర్మల్ ఇమేజరీ, లైడార్ సెన్సార్‌లు అమర్చి ఉంటాయి. ఈ డ్రోన్ గరిష్టంగా 10 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
>> అధునాతన రియల్ టైమ్ ప్రాసెసింగ్ కోసం సూరజ్ డ్రోన్ పూర్తిగా AI, ML, బయోనిక్ చిప్‌లను కలిగి ఉంది. ,
>> గరుడ ఏరోస్పేస్ ఈ డ్రోన్‌లో హైటెక్ టెక్నాలజీని అమర్చారు, తద్వారా ఇది రియల్ టైమ్ ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు.
>> వ్యూహాత్మక కార్యకలాపాలు, సంసిద్ధతను ప్లాన్ చేయడానికి ముందు ప్రధాన కార్యాలయం . స్థావరాలకు క్లిష్టమైన సమాచారం అందుబాటులో ఉండేలా డ్రోన్ నిర్ధారిస్తుంది అని స్టార్టప్ సూచించింది.

సైనిక సిబ్బందికి డ్రోన్ సహాయం చేస్తుంది
ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీతో పాటు BSF, CISF, CRPF, ITBP, DRDO, MOD, MHA లకు సహాయం చేయడానికి ఈ డ్రోన్‌ను సిద్ధం చేసినట్లు స్టార్టప్ కంపెనీ తెలిపింది. ఆగస్ట్ 2023 నాటికి ఇది ఎగరడానికి సిద్ధంగా ఉంటుందని కంపెనీ తెలియజేసింది. గరుడ ఏరోస్పేస్ సూరజ్ డ్రోన్‌ను అభివృద్ధి చేయడానికి NAL, DRDO అనేక ఇతర శాస్త్రవేత్తలు మార్గనిర్దేశం చేశారు. దేశ భద్రతలో సూరజ్ డ్రోన్ పాత్ర పోషిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు, సిఇఒ అగ్నిశ్వర్ జయప్రకాష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
 

click me!