
మహారాష్ట్రలోని అక్లూజ్లో ఉన్న శంకర్రావ్ మోహితే పాటిల్ సహకరి బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ విత్డ్రా పరిమితులను విధించింది. రాబోయే ఆరు నెలల వరకు బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాల నుండి రూ. 5,000 కంటే ఎక్కువ విత్డ్రా చేయలేరు. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాంకుపై ఆంక్షలు ఫిబ్రవరి 24, 2023 నుండి ఆరు నెలల పాటు అమలులో ఉంటాయి. RBI ముందస్తు అనుమతి లేకుండా బ్యాంక్ ఇప్పుడు రుణాలు మంజూరు చేయడం, పెట్టుబడులు పెట్టడం, డబ్బు బదిలీ చేయడం వంటివి చేయలేరు.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A కింద సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా లేదా మరేదైనా ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్లో రూ. 5,000 కంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే బ్యాంకు నుండి విత్డ్రా చేసుకోవచ్చని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
విత్డ్రా ఆంక్షలు విధించడాన్ని ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేసినట్లుగా భావించరాదని బ్యాంక్ పేర్కొంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు పరిమితులతో కూడిన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తామని ఆర్బీఐ తెలిపింది. అర్హత కలిగిన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ల కోసం డిపాజిట్ బీమా క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులుగా తెలిపింది.
ఈ బ్యాంకుల్లో హోంలోన్ వడ్డీరేటు చాలా తక్కువ ఓ లుక్కేయండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించింది . మే 2022 నుంచి ఆర్బీఐ ఆరుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. దీంతో దేశంలోని ప్రభుత్వ రంగ ప్రైవేట్ బ్యాంకులు తమ డిపాజిట్లు, రుణాల రేట్లను పెంచాయి. దీంతో బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం పెరిగింది. అదే సమయంలో, కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 8.55 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందిస్తోంది. అంటే 20 ఏళ్లకు రూ.75 లక్షల రుణం తీసుకుంటే రూ.65,324 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 8.60 శాతం వడ్డీని వసూలు చేస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వసూలు చేసే వడ్డీ 8.65 శాతం. దీని ప్రకారం 20 ఏళ్లకు రూ.75 లక్షల రుణానికి వినియోగదారుడు రూ.65,801 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డిఎఫ్సి 8.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 20 సంవత్సరాలకు రూ.75 లక్షల రుణంపై రూ.64,850 ఈఎంఐని వసూలు చేస్తుంది.
అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ గృహ రుణాలపై 8.75 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. 20 ఏళ్లలో రూ.75 లక్షల రుణం కోసం, ఈఎంఐ రూ.66,278 అవుతుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.