63 వ వార్షికోత్సవం అడుగుపెట్టిన యమహా కంపనీ

Published : Jul 03, 2018, 12:24 PM IST
63 వ వార్షికోత్సవం అడుగుపెట్టిన యమహా కంపనీ

సారాంశం

చెన్నై ప్రధాన కార్యాలయంలో పండగ వాతావరణం...

యమహా మోటర్ ఇండియా 63 వసంతంలోకి అడుగుపెట్టింది. జపాన్ కు చెందిన మాతృ సంస్థ యమహా మోటార్ కంపనీ లిమిటెడ్ ఏర్పడి ఇప్పటికి 62 సంవత్సరాలు ముగిసి 63 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1955 లో యమహా సంస్థను తమిళనాడులో ఏర్పాటు చేశారు. 

దేశవ్యాప్తంగా ఉన్న యమహా కంపనీకి చెందిన సంస్థల్లో జూలై 1 మరియు జూలై 2 తేదీల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ''యమహా డే'' పేరుతో జరిగిన వేడుకల్లో బాగంగా తమ బ్రాండ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తమ ఉద్యోగులకు యమహా సంస్థ సూచించింది. 

ఈ సందర్భంగా ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచే పలు కార్యక్రమాలను  నిర్వహించారు. అంతేకాకుండా ఇప్పటివరకు కంపనీ సాధించిన విజయాలను తెలియజేస్తూ, భవిష్యత్ లో వినియోదారును ఆకట్టుకునేలా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఉద్యోగులకు ఈ సంస్థ సూచించింది.

ఇక చెన్నై మహాబలిపురం రోడ్ లోని ఎకెడిఆర్ టవర్స్ లో గల  యమహా మోటార్స్ ఇండియా ప్రధాన కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాన్ ఇండియా యమహా డీలర్ షిప్స్ ఉద్యోగులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ''వన్ యమహా'' అనే కంపనీ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని చెన్నై,సూరజ్ పూర్, ఫరిదాబాద్ లోని యమహా కంపనీ ఉద్యోగులు తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు