ఇండియాలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ఓలా.. శ్రీనగర్‌లో 500వ ఎక్స్పీరియన్స్ సెంటర్..

Published : May 13, 2023, 05:12 PM ISTUpdated : May 13, 2023, 05:24 PM IST
ఇండియాలో అతిపెద్ద D2C ఆటోమొబైల్  నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ఓలా.. శ్రీనగర్‌లో 500వ ఎక్స్పీరియన్స్ సెంటర్..

సారాంశం

గత సంవత్సరం పూణేలో మొట్టమొదటి ECని ప్రారంభించినప్పటి నుండి కేవలం ఎనిమిది నెలలలోపు దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అతిపెద్ద D2C రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో, దాదాపు 300 నగరాల్లో ఓలా దాని ఉనికిని కలిగివుంది. 

మే 13, 2023: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది.  D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను గత కొన్ని వారాలుగా చురుకుగా ప్రారంభించుకుంటూ వస్తుంది. గత సంవత్సరం పూణేలో మొట్టమొదటి ECని ప్రారంభించినప్పటి నుండి కేవలం ఎనిమిది నెలలలోపు దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అతిపెద్ద D2C రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో, దాదాపు 300 నగరాల్లో ఓలా దాని ఉనికిని కలిగివుంది. 

కంపెనీ ఓమ్నిచానెల్ వ్యూహం ఇంకా ఆఫ్‌లైన్ విస్తరణ వేగం కారణంగా, ఓలా  నేడు భారతదేశంలో దాదాపు అన్ని మార్కెట్‌లను కవర్ చేస్తూ 98% మార్కెట్ రీచ్‌ను సాధించింది. ఇప్పటికే శ్రీనగర్‌లో 500వ EC ని ప్రారంభించిన ఓలా, ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ CMO అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో మా 500వ స్టోర్ ప్రారంభోత్సవంతో, మా డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) విధానం ద్వారా దేశం అంతటా విజయవంతగా విస్తరించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ అద్భుతమైన మైలురాయి ఎలక్ట్రిక్ మొబిలిటీని అందరికీ అందుబాటులోకి ఇంకా  సౌకర్యవంతంగా చేయడానికి మా అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. ఓలా ఎలక్ట్రిక్ భారతదేశం  పరిశుభ్రమైన ఇంకా స్థిరమైన భవిష్యత్తు వైపు పరివర్తనకు నాయకత్వం వహించడానికి మేము నిబద్ధతతో ఉన్నాము. ఈ  500వ స్టోర్‌ ప్రారంభించడం మా విజయాన్నీ సూచించడంతో పాటు ఇంకా ముందున్న సవాళ్లను కూడా గుర్తు చేస్తుంది. మా D2C మోడల్‌తో, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని సృష్టించడానికి మేము అద్భుతమైన స్థానంలో ఉన్నాము అలాగే సాధ్యమయ్యే సరిహద్దులను నిరంతరం నెట్టడానికి ఓలా ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.”

ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉపయోగపడతాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఔత్సాహికులకు ఓలా  ప్రపంచ స్థాయి ఉత్పత్తులను చూసి, నడిపే అనుభవించే అవకాశాన్ని అందించడమే కాకుండా, కొనుగోలు, ఫైనాన్సింగ్, అమ్మకాల తర్వాత సేవలపై మార్గదర్శకత్వాన్ని ఈ సెంటర్లు అందిస్తాయి. ఓలా వాహనాలను కొనుగోలు చేసేముందు సందర్శకులు S1 ఇంకా S1 ప్రో  టెస్ట్ రైడ్ కూడా తీసుకోవచ్చు.

ఆటోమొబైల్ రంగంలో D2C సేల్స్ & సర్వీస్ మోడల్‌ను భారతదేశంలో తొలిసారిగా పరిచయం చేసింది ఓలా. ఇందులో భాగంగా, డోర్‌స్టెప్ డెలివరీ అండ్ సర్వీసింగ్ సేవలను కంపెనీ అందిస్తుంది. కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 ECలు ఉన్నప్పటికీ, కంపెనీ విక్రయాలలో గణనీయమైన భాగం ఇప్పటికీ ఓలా వెబ్‌సైట్ అలాగే  యాప్‌ల నుండి వస్తుంది. ఓలా ఓమ్నిచానెల్ విధానం భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల అందుబాటుని  సులభతరం చేసింది.

ఓలా ప్రస్తుతం భారతదేశ ద్విచక్ర ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో 40% వాటాని స్వాధీనం చేసుకుంది. గత నెలలో, కంపెనీ తన అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసింది, 30,000 యూనిట్లకు పైగా విక్రయించింది, వరుసగా ఎనిమిదో నెలలో EV 2W అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

PREV
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు