70 లక్షల కారులో వీరు ఎం అమ్ముతున్నారో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్..

By asianet news teluguFirst Published Jun 5, 2023, 1:25 PM IST
Highlights

దాదాపు 70 లక్షలు ఖరీదు చేసే ఈ కారులో టీ కాస్త ఖరీదు అయినప్పటికీ మంచి ఆదరణ లభిస్తోందని వీరిస్పందన. అయితే ఈ  యువకులు ఒక కప్పు టీకి రూ.20 వసూలు చేస్తున్నారు.
 

ముంబై: విలాసవంతమైన కారులో ఇద్దరు యువకులు టీ అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఈ ఘటన మహారాష్ట్రలోని లోఖండ్‌వాలాలో చోటుచేసుకుంది. మన్ను శర్మ, అమిత్ కశ్యప్ లగ్జరీ ఆడి కారులో  టీ  స్టాల్   ఏర్పాటు చేశారు. దాదాపు 70 లక్షలు ఖరీదు చేసే ఈ కారులో టీ కాస్త ఖరీదు అయినప్పటికీ మంచి ఆదరణ లభిస్తోందని వీరి స్పందన. వీరు ఒక కప్పు టీకి రూ.20 వసూలు చేస్తున్నారు.

అంధేరీ సమీపంలోని విలాసవంతమైన ప్రాంతంలో టీ దుకాణం ప్రారంభించేటప్పుడు వెరైటీ లేకుంటే ఏముంటుందనే ఆలోచన ఈ యువతను ఆడి కార్లలోనే వ్యాపారం చేసేందుకు ప్రేరేపించిందని సూచిస్తున్నారు. తాజాగా ఈ ప్రాంతంలో గత ఆరు నెలలుగా ఆడిస్ లో టీ అమ్ముతున్న యువకులు వైరల్ గా మారారు. వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, లగ్జరీ కార్ ప్రియులు ఇక్కడికి తరలి రావడం ప్రారంభించారు. స్టాల్  ప్రారంభించాలని చూస్తున్నప్పుడు అనువైన ప్రదేశం దొరకడం కష్టమే దింతో 'ఆడి టీ'కి  దారితీసింది.

టీ రుచిలో కూడా షాపు కుతూహలాన్ని ఆపగలిగామని వారి షాపును సందర్శించే వారి స్పందన. మన్ను శర్మ హర్యానాలోని హిసార్‌కు చెందిన వ్యక్తి. ఆడి టీ ప్రారంభించడానికి ముందు, మన్ను శర్మ దక్షిణాఫ్రికాలో పనిచేశారు. అమిత్ కశ్యప్ పంజాబ్ వాసి. అమిత్ గతంలో స్టాక్ మార్కెట్‌లో పనిచేసేవాడు. భవిష్యత్తులో ఆడి టీ బ్రాంచులను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. 

click me!