26ఏప్రిల్ 2019 శుక్రవారం రాశిఫలాలు

By telugu teamFirst Published Apr 26, 2019, 7:47 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. శ్రమాధిక్యం పెరుగుతుంది. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. పోటీల్లో గెలుపు అధికం అవుతుంది. అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అధికారులతో జాగ్రత్త అవసరం. శివపారాయణ స్తోత్రం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అన్ని రకాల ఖర్చులు పెరుగుతాయి.  పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. శివపారాయణం, శివాభిషేకం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) :  పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.  కళాకారులకు కాస్త ఒత్తిడితో అనుకూల సమయం. పెద్దవారితో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. అన్ని విధాల లాభాలను సంపాదించుకుటాంరు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో తోివారు సహాయ పడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు లాభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు అనుకూలిస్తాయి. తృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :  విద్యార్థులకు అధిక శ్రమ ఒత్తిడి ఉంటాయి. ఫలితాలు ఆశించినంతగా ఉండవు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.    ధనమార్గం వైపు ఆలోచనలు వెళుతాయి. అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనుకోని ఇబ్బందులు వస్తాయి. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఊహించని పనుల్లో ఆటంకాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు తగ్గుతాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పరస్పర సహకారాలు లోపిస్తాయి. గౌరవం కోసం ఆరాట పడతారు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు జాగ్రత్త పడడం మంచిది. లోపాలు ఉండే సూచనలు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పోటీల్లో గెలుపు ఉంటాయి. శత్రువులపై విజయానికి ప్రయత్నిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సృజనాత్మకతను కోల్పోతారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. మానసిక అలజడి, భయం ఉంటాయి. పరిపాలన సమర్ధతత తగ్గిపోతుంది.   విద్యార్థులు ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. శ్రీ హయగ్రీవాయ నమః జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంఘంలో గౌరవం తగ్గుతుంది. సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. విందుభోజనాలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అన్ని పనుల్లో జాగ్రత్తలు అవసరం. క్రీం అచ్యుతానంత గోవింద మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పరాక్రమం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. పనుల్లో సౌలభ్యం లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :  మాటల్లో కఠినత పెరుగుతుంది. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు పనికిరావు. వాగ్దానాల వల్ల ఇబ్బందికి గురౌతారు. కుటుంబంలో కష్టాలకు సూచన. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అధికారులతో అనుకూలత పెంచుకోవాలి. విష్ణుసహస్రనామ పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!