నవరాత్రుల్లో ఈ రత్నాలను ధరిస్తే.. దేవీ అనుగ్రహం పొందడమే కాదు.. మీకంతా శుభమే జరుగుతుంది..

By Mahesh RajamoniFirst Published Sep 26, 2022, 10:55 AM IST
Highlights

నవరాత్రుల్లో రత్నాలను ధరించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం పొందడమే కాదు ఇంట్లో సౌభాగ్యం కూడా వెల్లివిరుస్తుందని జ్యోతిష్యులు నొక్కి చెబుతున్నారు. 
 

దేవీ నవరాత్రులు మొదలయ్యాయి. ఈ సమయంలో రత్నాలను ధరించడం  వల్ల ఎన్నోప్రయోజనాలను పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నవరాత్రి సమయంలో రత్నాలను ధరించడం వల్ల దేవీ అనుగ్రహం పొందడంతో పాటుగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి. కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంది. నవరాత్రుల్లో ధరించాల్సిన ఆ తొమ్మిది రత్నాలేంటో తెలుసుకుందాం పదండి. 

కెంపు రత్నం

కెంపు రత్నం గులాబీ, ఎరుపు రంగుల కలయికతో ఉంటుంది. ఈ కెంపు రత్నం సూర్యభగవానుడిని సూచిస్తుంది. సూర్యుని వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి.. నవరాత్రుళ్లో ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ ను పొందుతారు. రాజకీయాల్లో బాగా ఎదుగుతారు. కుంటుంబం సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుందని రత్నాల శాస్త్ర నినపుణులు చెబతున్నారు. వైవాహిక సంబంధాలు కూడా మెరుగుపడుతాయి. పెండెంట్లు లేదా ఉంగరాల్లో పొదగబడిన కెంపు రత్నం  మీ శక్తిని పెంచుతుంది. ఇవి సన్నిహితులతో సంబంధాన్ని కూడా మెరుగుపరుస్తాయి. 

నీలం నీలమణి

నీలం నీలమణి రత్నం ధరించడం  ఎంతో మంచిదని జ్యోతిష్యులు భావిస్తున్నారు.  ఎంతో విలువైన వాటిలో ఈ రత్నం ఒకటి. వీటిని పురాతన కాలంలో ప్రభువులు ధరించేవారు. ఈ రాయిలో సముద్ర రంగు కనిపిస్తుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల మీ లైఫ్ సాఫీగా సాగిపోతుంది. 

వజ్రం

అత్యంత విలువైన వజ్రాన్ని నాణ్యతలో ఏదీ బీట్ చేయలేదు. ఈ వజ్రాన్ని ధరించడం మీరెప్పుడూ సంతోషంగా ఉంటారు. పాజిటీవ్ ఆలోచనలే  వస్తాయి. శక్తి కూడా పెరుగుతంది. అందుకే మెరిసే విలువైన ఈ రాళ్లను ధరించి దేవీ అనుగ్రహం పొందండి. 

అమెథిస్ట్

అమెథిస్ట్ ను ఎక్కువగా నగలలో ఉపయోగిస్తుంటారు. ఈ రాయి మత్తుకు బానిస అయిన వారిని బయటపడేస్తుందని నమ్ముతారు. అందుకే అప్పట్లో గ్రీకులు వీటిని ఎక్కువగా ధరించేవారు. ఈ రాయిని ధరించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని నవరాత్రి సమయంలో ఎక్కువగా ధరిస్తారు. 

పచ్చ

పచ్చను  ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇది ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అలాగే తెలివితేటలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. నరాల బలహీనత, మానసిక సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. 

పిల్లి కన్ను రాయి

ఇది అధునాతనమైన రాయి. విలక్షణమైంది కూడా. దీన్ని ధరించడంం వల్ల శరీరంలో శక్తి పెరగుతుంది. శరీరం ఉత్తేజంగా మారుతుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 

గులాబీ క్వార్ట్జ్

గులాబీ క్వార్ట్జ్ ను ధరించడం వల్ల  మన:శ్శాంతిగా ఉంటాయి. ఇతరుల నుంచి నమ్మకాన్ని తిరిగి పొందుతారు. ఇది ప్రేమను కూడా పెంచుతుంది. అందుకే దీన్ని లవ్ స్టోన్ అని కూడా అంటారు.

click me!