వాస్తు దోషం వల్ల కలిగే సమస్యల నుండి బయటపడగలమని నమ్ముతారు. అదేవిధంగా, లవంగం-కర్పూరం ఈ నివారణలు వాస్తు దోషాన్ని తొలగించడంలో, డబ్బు ప్రవాహాన్ని సరిగ్గా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు ఎప్పటికీ శుభం కాదంటారు. దీంతో పాటు ఇంట్లో సుఖశాంతులు కూడా చెదిరిపోయి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో, వాస్తు దోషాలను వదిలించుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు కూడా పేర్కొన్నారు. ఈ మార్గాలను అనుసరించడం వల్ల వాస్తు దోషం తొలుగుతుందని.. వాస్తు దోషం వల్ల కలిగే సమస్యల నుండి బయటపడగలమని నమ్ముతారు. అదేవిధంగా, లవంగం-కర్పూరం ఈ నివారణలు వాస్తు దోషాన్ని తొలగించడంలో, డబ్బు ప్రవాహాన్ని సరిగ్గా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లేకుంటే, ఆర్థిక సంక్షోభం ఉంటే, కర్పూరం, కొన్ని లవంగాలను ఇంటి వంటగదిలో ఒక గిన్నెలో ఉంచి ఉదయం, సాయంత్రం కాల్చండి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి.
ఒక వ్యక్తి డబ్బు చాలా కాలంగా నిలిచిపోయి తిరిగి చేతికి రాకపోతే... ఎరుపు గులాబీలో కొన్ని కర్పూరం ముక్కలు, కొన్ని లవంగాలు వేసి దుర్గాదేవికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం ఉంది.
లక్ష్మీ దేవి కి ప్రతిరోజూ సాయంత్రం కర్పూరంతో క్రమం తప్పకుండా హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని వాస్తు దోషం తొలగిపోతుంది. దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఒక గిన్నెలో 5 లవంగాలు, కొన్ని కర్పూరం, యాలకులు కాల్చండి. ఆ తర్వాత దాని పొగను ఇంటిలోని అన్ని గదులకు, ప్రార్థనా స్థలానికి తీసుకెళ్లండి. దాని నుండి వచ్చే పొగ ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. సానుకూల శక్తిని తెస్తుంది. ఇది మన జీవితంపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది.
రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఇత్తడి పాత్రలో కాల్చితే కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి చేకూరుతాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
మీకు శత్రువుల వల్ల ఇబ్బంది ఉంటే
, ఏడు సార్లు బజరంగబన్ పఠించడం ద్వారా హనుమంతునికి లడ్డూలను సమర్పించండి. తర్వాత ఐదు లవంగాలతో కర్పూరాన్ని వెలిగించాలి. దాని భస్మ తిలకం పూసిన తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శత్రువులను ఓడించవచ్చు.