ఆ డబ్బు నాకిచ్చినా అమరావతి పూర్తయిపోయేది: నార్నే శ్రీనివాసరావు

By Siva KodatiFirst Published Apr 7, 2019, 2:55 PM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నే శ్రీనివాసరావు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నే శ్రీనివాసరావు.

హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన..  ప్రతి ఐదేళ్లకొకసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం దానిని మోసం చేయడం, బయటకు రావడం, ఆ పార్టీని తిట్టించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందన్నారు.

ప్రధాని నరేంద్రమోడీని నాలుగేళ్లు నెత్తిన ఎక్కించుకుని హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అన్నట్లుగా వ్యవహరించారని నార్నే ఆరోపించారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో లాభాలు వస్తాయని జీఎస్టీ సమస్య ఉండేది కాదన్నారు.

చంద్రబాబుకు ఇచ్చినట్లు తనకు కాని మరో బిల్డర్‌కు కానీ ఇచ్చుంటే ఈపాటికే అమరావతి పూర్తయిపోయి ఉండేదని నార్నే ఎద్దేవా చేశారు. ఇంకో 20 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నా అమరావతి ఇలాగే ఉంటుందని అందులో ఏ మార్పు రాదని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. జగన్‌కు అవకాశం ఇస్తే ఎన్టీఆర్, వైఎస్సార్‌లను మించిన నాయకుడు అవుతారని నార్నే అభిప్రాయపడ్డారు.. 

click me!