ఏపీపై భారీ కుట్ర, రేపు బయటపెడతా: ఆపరేషన్ గరుడ హీరో శివాజీ

By Nagaraju penumalaFirst Published Apr 6, 2019, 3:24 PM IST
Highlights

కుట్రలకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని శివాజీ తెలిపారు. ఆదివారం ఉదయం ఆ కుట్రకు సంబంధించి ఆధారాలను మీడియాకు తెలియజేస్తానని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పదవి నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై భారీ కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు ఆపరేషన్ గరుడ సృష్టికర్త హీరో శివాజీ. రాష్ట్రంపై చాలా కుట్రలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాలుగు రోజుల్లో ఏపీలో భారీ కుట్రలు జరగబోతున్నాయని తెలిపారు. 

కుట్రలకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని శివాజీ తెలిపారు. ఆదివారం ఉదయం ఆ కుట్రకు సంబంధించి ఆధారాలను మీడియాకు తెలియజేస్తానని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పదవి నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎస్ ను మార్చడం కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మోదీ కుట్రేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమీషన్ ప్రధాని నరేంద్రమోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని హీరో శివాజీ ఆరోపించారు.  

click me!