చంద్రగిరిలో రీపోలింగ్.. టీడీపీ అభ్యర్థిపై కేసు నమోదు

By telugu teamFirst Published May 19, 2019, 12:22 PM IST
Highlights

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాకాల మండలంలోని పులివర్తివారిపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావ మరిది కేశవులు రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి పులివర్తి నాని చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పులివర్తి నానిపై పాకాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. 

 కాగా గతంలోనూ  పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి ని... గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ విషయంలో పెద్ద రబసే జరిగింది.  అడ్డొచ్చిన పోలీసులపైనా చిందులేశారు. బతుకు తెరువు కోసం కొనుగోలు చేసిన ఆటోనూ ధ్వంసం చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. వైసీపీకి ఓటేస్తే మీ అంతుచూస్తామంటూ దళితులను గదమాయించారు. ఓటర్లను గృహనిర్బంధం చేస్తూ అలజడి సృష్టించారు.

click me!