టీడీపీకి జనసేన నష్టమే ఎక్కువ: హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Apr 17, 2019, 10:46 AM IST
Highlights

పసుపు-కుంకుమ పథకం వల్ల వచ్చే లాభం కంటే జనసేన వల్ల టీడీపీకి కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు.

పాలకొల్లు:  పసుపు-కుంకుమ పథకం వల్ల వచ్చే లాభం కంటే జనసేన వల్ల టీడీపీకి కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు-కుంకుమ పథకం వల్ల  తమకు మహిళల ఓటింగ్ భారీగా వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులుతీరి ఉండడాన్ని కూడ ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.

అయితే పసుపు-కుంకుమ పథకం వల్ల వచ్చే లాభం కంటే జనసేన పార్టీ చీల్చే ఓట్లు టీడీపీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.  ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడ 90 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలు రావని ఆయన స్పష్టం చేశారు. 

వైసీపీ కూడ గత ఎన్నికల కంటే ఈ ఐదేళ్లలో గత ఎన్నికల కంటే కొత్త వర్గాలను ఆకర్షించలేకపోయిందని ఆయన తెలిపారు. బీఎస్పీ జనసేనతో పొత్తు పెట్టుకొన్న కారణంగా దళితుల ఓట్లలో చీలిక వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం వైసీపీకి నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
 

click me!