టీడీపీ గెలుపు ఖాయం.. చంద్రబాబే సీఎం.. అయ్యన్నపాత్రుడు

By telugu teamFirst Published Apr 25, 2019, 11:04 AM IST
Highlights

ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. తమ పార్టీ గెలుపు ఖాయమని.. చంద్రబాబు సీఎం అవ్వడం కూడా ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. తమ పార్టీ గెలుపు ఖాయమని.. చంద్రబాబు సీఎం అవ్వడం కూడా ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని... టీడీపీ గెలుపు పక్కాని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చిన అయ్యన్నపాత్రుడు.. మీడియాతో మాట్లాడారు.

ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని.. వైసీపీ నేతల ఓటమి ఖాయమని చెప్పారు. ఓడిపోతామని తెలిసినా కూడా వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పసుపు-కుంకుమ, పింఛన్లు తమకు కలిసొచ్చే అంశాలని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం వచ్చే నెల 23న విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో.. అభ్యర్థులంతా టెన్షన్  లో మునిగి ఉన్నారు. ఓటరు నిర్ణయం ఎలా ఉందో తెలియాలంటే మాత్రం నెల రోజులు ఆగాల్సిందే. 

click me!