
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడుతున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎల్కె. అద్వానీ తన బ్లాగ్లో రాసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మోడీని విమర్శించారు.
అద్వానీ అన్న మాటలు మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉందని.. తన స్వార్థం కోసం సొంత పార్టీని, దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి మోడీ వచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేయడమే కాకుండా కుట్రలతో మనపై దాడులు చేస్తున్నారన్నారు.
ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి చేతుల్లో దేశం ఉందని, జాతీయవాదం అంటే దేశద్రోహం ముద్రవేయడం కాదని మోడీకి చురకలు అంటించారు.