ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్
May 23, 2019, 8:14 AM IST
45 రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. ఎగ్జిట్ పోల్స్కు సైతం అందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఫలితాలల్లో అంతిమ విజేత ఎవరో గురువారం తేలిపోనుంది. కౌంటింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
9:53 PM
గన్నవరంలో వల్లభనేని వంశీ గెలుపు
కృష్ణాజిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వల్లభనేని వంశీ విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో వంశీ 820 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
9:49 PM
15 ఓట్ల తేడాతో బొండాపై మల్లాది విష్ణు గెలుపు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉత్కంఠ నడుమ ఫలితం విడుదలైంది. టీడీపీ అభ్యర్ధి బొండా ఉమపై వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు 15 ఓట్ల తేడాతో గెలుపొందారు.
9:15 PM
వైఎస్ జగన్కు వెంకయ్య నాయుడు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. జగన్కు ఫోన్ చేసిన ఆయన.. తెలుగు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వెంకయ్య తెలిపారు.
9:11 PM
జగన్ కు ప్రణబ్ శుభాకాంక్షలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు. మీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపారమైన విశ్వాసాన్ని చూపారు.. ప్రజలు, రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా... వైఎస్ ఖచ్చితంగా గర్వపడే రోజు ఇది’’ అని ప్రణబ్ ట్వీట్ చేశారు.
9:05 PM
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి
చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరాజయం పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి విడుదల రజనీ విజయం సాధించారు.
9:04 PM
పరిటాల శ్రీరామ్ ఓటమి
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు, శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
8:55 PM
మంత్రి దేవినేని ఉమా ఓటమి
కృష్ణాజిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమా ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి వసంత వెంకట కృష్ణప్రసాద్ 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
8:35 PM
ప్రజా తీర్పును శిరసావహిస్తాం: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ్ స్పందించారు. ప్రధాని మోడీ, వైఎస్ జగన్లకు అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ఎప్పుడూ ప్రజా పక్షమేనని లోకేశ్ స్పష్టం చేశారు.
8:29 PM
అన్నింటికి సిద్ధపడే పార్టీ పెట్టా: పవన్
అన్నింటికి సిద్ధపడే పార్టీ పెట్టానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన జనసైనికులకు, జనసేనకు ఓటు వేసిన ప్రజలకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.
బలమైన మెజారిటీ సాధించిన వైఎస్ జగన్, ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస విడిచే వరకు రాజకీయాల్లో ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఏ ప్రత్యేక హోదా అయితే వస్తుందని అంతా భావించారో... ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు.
జనసేన ఈ ఎన్నికల్లో కొత్తరకం రాజకీయాలు చేసిందని... ఎక్కడా డబ్బు, మద్యం పంచలేదని పవన్ స్పష్టం చేశారు. తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, రెండు స్ధానాల్లో ఓడినా.. మా వాళ్లు ఒక్క సీటు గెలవకపోయినా.. తుది శ్వాస వరకు ప్రజలకు అండగా ఉంటానని జనసేనాని తెలిపారు.
8:09 PM
నారా లోకేశ్ ఓటమి
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
7:59 PM
కడప, కర్నూలు, నెల్లూరులలో వైసీపీ క్లీన్ స్వీప్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలకు జిల్లాలే వైసీపీ ఖాతాలో వచ్చి పడ్డాయి. ముఖ్యంగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
7:50 PM
స్పీకర్ కోడెల ఓటమి
సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు విజయం సాధించారు.
7:49 PM
మంత్రి నారాయణ ఓటమి
నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
7:19 PM
జగన్కు చంద్రబాబు అభినందనలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోడీకి, ఒడిషా ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ పట్నాయక్కు బాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
7:08 PM
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఓటమి
ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఆమెపై వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి విజయం సాధించారు.
7:02 PM
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ముఖ్యమంత్రి పదవికి నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపారు. అనంతరం బాబు రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగాలని చంద్రబాబును గవర్నర్ కోరారు.
6:56 PM
గంటా గెలుపు గంట
విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్ధి, మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.
6:51 PM
హిందూపురంలో బాలకృష్ణ విజయం
అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు.
6:50 PM
ట్యాంపరింగ్ ఆరోపణ.. వినుకొండలో ఆగిన ఫలితం
గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ఫలితం ప్రకటన ఆగిపోయింది. బొల్లాపల్లి మండలం గండిగనుమల తండా బూత్కి చెందిన ఈవీఎంలలో ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం రావడంతో టీడీపీ అభ్యర్ధి జీవీ ఆంజనేయులు ఆందోళనకు దిగారు.
6:45 PM
మంగళగిరిలో విజయం దోబూచులాట
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫలితం ఉత్కంఠగా మారింది. ఇంకా మరికొన్ని రౌండ్లు లెక్కించాల్సి వుండగా... వైసీపీ అభ్యర్ధి ఆర్కే ఆధిక్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
6:41 PM
మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిన వైసీపీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 88 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. మరో 60 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
6:39 PM
చిలకలూరిపేటలో మొరాయించిన ఈవీఎంలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కౌంటింగ్కు ఆటంకం ఏర్పడింది. ఇక్కడ 14 ఈవీఎంలు మొరాయించడంతో ఫలితం ఆసక్తిగా మారింది. దీంతో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
6:08 PM
ప్రమాణ స్వీకారం తిరుపతిలో కాదు.. విజయవాడలో: జగన్
తన ప్రమాణ స్వీకారం తిరుపతిలో కాదని .. విజయవాడలో అని స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో తనకు ఈ అపూర్వ విజయం దక్కిందన్నారు జగన్. ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం జరగుతుందని ఆయన తెలిపారు.
5:33 PM
ఎచ్చెర్లలో కళా వెంకట్రావు ఓటమి
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి కిరణ్ కుమార్ విజయం సాధించారు.
5:26 PM
గన్నవరం ఫలితంపై ఉత్కంఠ
కృష్ణా జిల్లా గన్నవరం ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ 712 ఓట్ల తేడాతో విజయం సాధించగా, ఇంకా 3 ఈవీఎంలు, 400 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి రావడంతో ఇరు పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది.
5:09 PM
జనసేనకు మరో షాక్.. భీమవారంలోనూ పవన్ ఓటమి
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మరో షాక్ తగిలింది. భీమవరంలో ఆయన ఓటమి పాలయ్యారు. పవన్పై వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాసరావు 3,900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
4:42 PM
జనసేనకు షాక్.. గాజువాకలో పవన్ ఓటమి
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా గాజువాకలో పవన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి గెలుపొందారు. పవన్కు 30,905 ఓట్లు రాగా.. నాగిరెడ్డికి 34,712 ఓట్లు లభించాయి.
4:39 PM
చీపురుపల్లిలో బొత్స విజయం
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయం సాధించారు.
4:34 PM
చింతమనేని ఓటమి
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ ఓటమి పాలయ్యారు
4:27 PM
91 వేల భారీ మెజారిటీతో వైఎస్ జగన్ విజయం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి సతీశ్ రెడ్డిపై 91 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
4:15 PM
జగన్కు మోడీ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
4:13 PM
వెలవెలబోతున్న చంద్రబాబు నివాసం
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసం వెలవెలబోతోంది. ఓటమి భారంతో నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నారు.
4:00 PM
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజీనామా
కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా, జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
3:55 PM
పత్తిపాడులో వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత విజయం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్ధి డొక్కా మాణిక్య వరప్రసాద్ను ఓడించారు.
3:51 PM
మంత్రి సోమిరెడ్డి ఓటమి
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
3:49 PM
చీరాలలో కరణం బలరాం గెలుపు
ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్ధి కరణం బలరామ కృష్ణమూర్తి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి ఆమంచి కృష్ణమోహన్పై 12,600 ఓట్ల తేడాతో గెలుపొందారు.
3:47 PM
రాజోలులో గెలిచిన జనసేన అభ్యర్ధి
జనసేన పార్టీకి ఎట్టకేలకు విజయం దక్కింది. రాజోలులో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ 3400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
3:44 PM
పెద్దాపురంలో గెలుపొందిన చినరాజప్ప
హోంమంత్రి, టీడీపీ అభ్యర్ధి చినరాజప్ప పెద్దాపురంలో విజయం సాధించారు. ఆయనకు 3200 ఓట్ల మెజారిటీ వచ్చింది.
3:43 PM
అవనిగడ్డలో వైసీపీ అభ్యర్ధి సింహాద్రి రమేశ్ విజయం
కృష్ణాజిల్లా అవనిగడ్డలో వైసీపీ అభ్యర్ధి సింహాద్రి రమేశ్ బాబు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
3:29 PM
చంద్రగిరిలో చెవిరెడ్డి విజయం
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 33,700 ఓట్ల మెజార్టీ వచ్చింది.
3:27 PM
రోజా గెలుపు
చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీనటి ఆర్కే రోజా విజయం సాధించారు. ఆమెకు 2,681 ఓట్ల ఆధిక్యం లభించింది.
3:20 PM
వైఎస్ జగన్ను కలిసిన ఎల్వీ సుబ్రమణ్యం
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కలిశారు.
3:14 PM
బాబు నివాసం వద్ద... జై జగన్ నినాదాలు, ఉద్రిక్తత
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నినాదాలతో పాటు.. బై బై బాబు అంటూ వైసీపీ కార్యకర్తలు కోలాహలం సృష్టించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.
3:10 PM
చంద్రబాబు గెలుపు
కుప్పంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపొందారు.
2:27 PM
పవన్కు మళ్లీ ఆధిక్యం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. భీమవరంలో ఆయన స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
2:12 PM
గాజువాక, భీమవరంలలో పవన్ వెనుకంజ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజలో ఉన్నారు. గాజువాక, భీమవరంలలో ఆయనపై వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో నిలిచారు.
2:07 PM
కృష్ణాజిల్లాలో రెండు చోట్ల వైసీపీ గెలుపు
కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. పెడనలో జోగీ రమేశ్, మచిలీపట్నంలో పేర్ని నాని గెలుపొందగా.. మరికొందరు ఆధిక్యంలో ఉన్నారు.
2:05 PM
55 వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పులివెందులలో టీడీపీ అభ్యర్ధి సతీశ్ రెడ్డి కంటే 55,700 ఓట్ల ఆధిక్యంలో జగన్ కొనసాగుతున్నారు.
1:51 PM
కిడారి శ్రవణ్ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు
గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ అభ్యర్ధి కిడారి శ్రవణ్ కంటే నోటాకు ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో అరకులో సెంటిమెంట్ వర్కవుట్ అవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు.
1:42 PM
ప్రజల తీర్పును గౌరవిస్తున్నా: అమర్నాథ్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ అభ్యర్ధి అమర్నాథ్ రెడ్డి. అపజయానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమన్నారు.
1:39 PM
ప్రత్యేక హోదానే మా అజెండా: వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం కట్టబెట్టినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని తాము ఊహించిందేనన్నారు.
ప్రజలు, దేవుడు పార్టీని ఆశీర్వదించారన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్రమోడీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడే తానేమీ మాట్లాడనని జగన్ వ్యాఖ్యానించారు.
1:31 PM
వైసీపీ మూడో విజయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో విజయాన్ని నమోదు చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం వైసీపీ అభ్యర్ధి జోగారావు విజయం సాధించారు.
1:24 PM
చింతలపూడిలో వైసీపీ అభ్యర్ధి ఎలీజా విజయం
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైసీపీ అభ్యర్ధి ఎలీజా గెలుపొందారు.
1:23 PM
విజయనగరంలో వైసీపీ అభ్యర్ధి కోలగట్ల గెలుపు
విజయనగరంలో వైసీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు.
1:17 PM
తిరుపతిలో జగన్ ప్రమాణ స్వీకారం
ఎన్నికల అఖండ మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీ తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
1:10 PM
జగన్కు కేటీఆర్ శుభాకాంక్షలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
1:05 PM
జగన్కు అభినందనలు తెలిపిన కేసీఆర్
ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్.. స్వయంగా జగన్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని కేసీఆర్ ఆకాంక్షించారు.
1:00 PM
ఆధిక్యంలోకి దగ్గుబాటి
ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్ధి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావుపై 317 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
12:55 PM
గాజువాకలో ఆధిక్యంలో పవన్
విశాఖజిల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప ఆధిక్యంలో నిలిచారు.
12:50 PM
గుంటూరు జిల్లాలో సీనియర్ నేతలు వెనుకంజ
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల వెనుకంజలో ఉన్నారు.
12:48 PM
లోకేశ్పై 9 వేల ఓట్ల ఆధిక్యంలో ఆర్కే
మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 9 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
12:45 PM
గుడివాడ మున్సిపల్ ఛైర్మన్పై దాడి
కౌంటింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా గుడివాడలో సల్వ ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ ఛైర్మన్పై కౌంటింగ్ కేంద్రం సమీపంలో కొందరు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును వేగంగా నడిపాడు.
12:30 PM
టీడీపీ ఆధిక్యంలో ఉన్న స్ధానాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చతికిలపడింది.కేవలం 26 స్థానాల్లో మాత్రం సైకిల్ ఆధిక్యంలో ఉంది. కుప్పం, తాడికొండ, రేపల్లె, గుంటూరు వెస్ట్, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ సౌత్, పెద్దాపురం, రామచంద్రాపురం, ముమ్మిడివరం, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పర్చూరు, అద్దంకి, చీరాల, కందుకూరు, హిందూపురం, ఇచ్చాపురం, పాతపట్నం, తిరువూరు, కైకలూరు, విజయవాడ ఈస్ట్
12:23 PM
భీమవరంలో మూడో స్థానంలో పవన్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనుకంజలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్ధి మూడో స్థానంలో, టీడీపీ అభ్యర్ధి రెండో స్థానంలో ఉన్నారు.
12:12 PM
సాయంత్రం మీడియా ముందుకు జగన్
ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సాయంత్రం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు.
12:03 PM
మంత్రి గంటా వెనుకంజ
విశాఖ నార్త్లో మంత్రి గంటా శ్రీనివాసరావు వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి కేకే రాజు 587 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
11:59 AM
స్పీకర్ కోడెల వెనుకంజ
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్ కోడెలపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు 6,175 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
11:52 AM
స్వరూపనంద సరస్వతి ఆశీస్సులు అందుకున్న జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారు కావడంతో జగన్... విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనంద సరస్వతితో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా స్వరూపనంద .. జగన్కు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీస్సులు అందజేశారు.
11:47 AM
సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి బాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. సాయంత్రం హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్కు ఆయన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.
11:40 AM
25న వైసీపీ శాసనసభాపక్ష సమావేశం
ఈ నెల 25న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగే ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.
11:32 AM
30న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో జగన్ ముఖ్యమంత్రి కల నెరవేరినట్లయ్యింది. ఈ నెల 30న వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
11:22 AM
ఏపీలో స్పష్టమైన ఆధిక్యం దిశగా వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లోక్సభ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో అధికారానికి చేరువైంది.
11:13 AM
కోడెల వెనుకంజ
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు ఆధిక్యంలో నిలిచారు.
11:08 AM
వెనుకంజలో మంత్రుల కుమారులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు కుమారులు వెనుకంజలో ఉన్నారు. పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ రాప్తాడులో వెనుకంజలో ఉన్నారు. అలాగే కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపై వైసీపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.
11:05 AM
భూమా అఖిలప్రియ వెనుకంజ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ వెనుకంజలో ఉన్నారు.
11:02 AM
రాప్తాడులో పరిటాల శ్రీరామ్ వెనుకంజ
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల శ్రీరామ్ వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
10:59 AM
బందరు పరిధిలో ఫ్యాన్ హవా
కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అత్యధిక స్ధానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పామర్రు, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పెడన, పెనమలూరు స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.
10:53 AM
అమెరికా, ఆస్ట్రేలియాలలో వైసీపీ సంబరాలు
ఆంధ్రప్రదేశ్ లోక్సభ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో ముగినిపోయాయి. అమెరికా, ఆస్ట్రేలియాలలోని వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
10:49 AM
పశ్చిమగోదావరిలో సర్వర్ల మొరాయింపు
పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వర్లు పనిచేయకపోవడంతో గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో నిలిచారు.
10:46 AM
విజయనగరం, శ్రీకాకుళం ఫ్యాన్ హవా
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్ధానాల్లో ఆధిక్యంలో నిలిచింది.
10:42 AM
పెద్దాపురంలో హోంమంత్రి చినరాజప్ప వెనుకంజ
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో హోంమంత్రి చినరాజప్ప వెనుకంజలో నిలిచారు.
10:39 AM
మంగళగిరిలో 14 వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్ధి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
10:37 AM
చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ ఆధిక్యత
సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. మొత్తం 14 స్ధానాల్లో 13 చోట్ల వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి, నగరిలో రోజా ముందంజలో ఉన్నారు.
10:33 AM
ఉదయగిరిలో వైసీపీ ఆధిక్యత
ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి మేకపాటి శేఖర్ రెడ్డి రెండో రౌండ్ ముగిసేసరికి 3953 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
10:31 AM
నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు వెనుకంజ
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ అభ్యర్ధి కొడాలి నాని.. టీడీపీ అభ్యర్ధి దేవినేని అవినాశ్పై 2600 ఓట్ల తేడాతో ఆధిక్యంలో నిలిచారు.
10:20 AM
నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు వెనుకంజ
విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు వెనుకంజలో నిలిచారు.
10:14 AM
మంగళగిరిలో ఆధిక్యంలోకి వచ్చిన వైసీపీ
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. టీడీపీ అభ్యర్ధి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి 1010 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
10:12 AM
గుడివాడలో కొడాలి నాని ముందంజ
గుడివాడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని ముందంజలో నిలిచారు.
10:08 AM
పర్చూరులో దగ్గుబాటి వెనుకంజ
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెనుకంజలో నిలిచారు. ఆయనపై టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు ఆధిక్యంలో నిలిచారు.
10:01 AM
లోకేశ్పై 600 ఓట్ల ఆధిక్యంలో ఆర్కే
మంగళగిరిలో మొదటి రౌండ్ ముగిసే సరికి మంత్రి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్ధి ఆర్కే 600 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు
9:54 AM
వెనుకంజలో మంత్రులు
ఏపీ అసెంబ్లీ తొలి రౌండ్లో మంత్రులు వెనుకంజలో నిలిచారు. సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు వెనుకంజలో నిలిచారు. వారిపై వైసీపీ కార్యకర్తలు ముందంజలో నిలిచారు.
9:51 AM
స్పీకర్ కోడెల వెనుకంజ
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
9:48 AM
మంగళగిరిలో లోకేశ్ వెనుకంజ
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
9:42 AM
చంద్రబాబు ఆధిక్యం
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చారు.
9:39 AM
ముమ్మిడివరంలో జనసేన ఆధిక్యం
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జనసేన అభ్యర్ధి పితాని బాలకృష్ణ ముందంజలో నిలిచారు. .
9:35 AM
హిందూపురంలో బాలకృష్ణ ముందంజ
అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు, నందమూరి బాలకృష్ణ ముందంజలో నిలిచారు.
9:34 AM
చంద్రబాబు వెనుకంజ
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి కె.చంద్రమౌళి స్వల్ప ఆధిక్యంలో నిలిచారు.
9:24 AM
టెక్కలి తొలి రౌండ్లో వైసీపీ లీడ్
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ముందంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి పేరాడ తిలక్ 1600 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
9:23 AM
గాజువాక, భీమవరంలో పవన్ కల్యాణ్ వెనుకంజ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరంలో పవన్ కల్యాణ్ వెనుకంజలో నిలిచారు.
9:22 AM
గుంటూరు ఈస్ట్, వెస్ట్లో టీడీపీ లీడ్
గుంటూరు ఈస్ట్, వెస్ట్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో నిలిచింది.
9:53 PM IST:
కృష్ణాజిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వల్లభనేని వంశీ విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో వంశీ 820 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
9:49 PM IST:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉత్కంఠ నడుమ ఫలితం విడుదలైంది. టీడీపీ అభ్యర్ధి బొండా ఉమపై వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు 15 ఓట్ల తేడాతో గెలుపొందారు.
9:15 PM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. జగన్కు ఫోన్ చేసిన ఆయన.. తెలుగు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వెంకయ్య తెలిపారు.
9:11 PM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు. మీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపారమైన విశ్వాసాన్ని చూపారు.. ప్రజలు, రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా... వైఎస్ ఖచ్చితంగా గర్వపడే రోజు ఇది’’ అని ప్రణబ్ ట్వీట్ చేశారు.
9:06 PM IST:
చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరాజయం పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి విడుదల రజనీ విజయం సాధించారు.
9:04 PM IST:
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు, శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
8:56 PM IST:
కృష్ణాజిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమా ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి వసంత వెంకట కృష్ణప్రసాద్ 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
8:35 PM IST:
ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ్ స్పందించారు. ప్రధాని మోడీ, వైఎస్ జగన్లకు అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ఎప్పుడూ ప్రజా పక్షమేనని లోకేశ్ స్పష్టం చేశారు.
8:32 PM IST:
అన్నింటికి సిద్ధపడే పార్టీ పెట్టానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన జనసైనికులకు, జనసేనకు ఓటు వేసిన ప్రజలకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.
బలమైన మెజారిటీ సాధించిన వైఎస్ జగన్, ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస విడిచే వరకు రాజకీయాల్లో ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఏ ప్రత్యేక హోదా అయితే వస్తుందని అంతా భావించారో... ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు.
జనసేన ఈ ఎన్నికల్లో కొత్తరకం రాజకీయాలు చేసిందని... ఎక్కడా డబ్బు, మద్యం పంచలేదని పవన్ స్పష్టం చేశారు. తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, రెండు స్ధానాల్లో ఓడినా.. మా వాళ్లు ఒక్క సీటు గెలవకపోయినా.. తుది శ్వాస వరకు ప్రజలకు అండగా ఉంటానని జనసేనాని తెలిపారు.
8:10 PM IST:
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
8:00 PM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలకు జిల్లాలే వైసీపీ ఖాతాలో వచ్చి పడ్డాయి. ముఖ్యంగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
7:50 PM IST:
సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు విజయం సాధించారు.
7:49 PM IST:
నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
7:19 PM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోడీకి, ఒడిషా ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ పట్నాయక్కు బాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
7:08 PM IST:
ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఆమెపై వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి విజయం సాధించారు.
7:02 PM IST:
ముఖ్యమంత్రి పదవికి నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపారు. అనంతరం బాబు రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగాలని చంద్రబాబును గవర్నర్ కోరారు.
6:56 PM IST:
విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్ధి, మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.
6:51 PM IST:
అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు.
6:50 PM IST:
గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ఫలితం ప్రకటన ఆగిపోయింది. బొల్లాపల్లి మండలం గండిగనుమల తండా బూత్కి చెందిన ఈవీఎంలలో ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం రావడంతో టీడీపీ అభ్యర్ధి జీవీ ఆంజనేయులు ఆందోళనకు దిగారు.
6:45 PM IST:
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫలితం ఉత్కంఠగా మారింది. ఇంకా మరికొన్ని రౌండ్లు లెక్కించాల్సి వుండగా... వైసీపీ అభ్యర్ధి ఆర్కే ఆధిక్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
6:41 PM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 88 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. మరో 60 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
6:39 PM IST:
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కౌంటింగ్కు ఆటంకం ఏర్పడింది. ఇక్కడ 14 ఈవీఎంలు మొరాయించడంతో ఫలితం ఆసక్తిగా మారింది. దీంతో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
6:08 PM IST:
తన ప్రమాణ స్వీకారం తిరుపతిలో కాదని .. విజయవాడలో అని స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో తనకు ఈ అపూర్వ విజయం దక్కిందన్నారు జగన్. ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం జరగుతుందని ఆయన తెలిపారు.
5:34 PM IST:
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి కిరణ్ కుమార్ విజయం సాధించారు.
5:27 PM IST:
కృష్ణా జిల్లా గన్నవరం ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ 712 ఓట్ల తేడాతో విజయం సాధించగా, ఇంకా 3 ఈవీఎంలు, 400 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి రావడంతో ఇరు పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది.
5:09 PM IST:
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మరో షాక్ తగిలింది. భీమవరంలో ఆయన ఓటమి పాలయ్యారు. పవన్పై వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాసరావు 3,900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
4:42 PM IST:
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా గాజువాకలో పవన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి గెలుపొందారు. పవన్కు 30,905 ఓట్లు రాగా.. నాగిరెడ్డికి 34,712 ఓట్లు లభించాయి.
4:39 PM IST:
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయం సాధించారు.
4:34 PM IST:
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ ఓటమి పాలయ్యారు
4:27 PM IST:
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి సతీశ్ రెడ్డిపై 91 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
4:15 PM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
4:13 PM IST:
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసం వెలవెలబోతోంది. ఓటమి భారంతో నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నారు.
4:01 PM IST:
కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా, జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
3:56 PM IST:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్ధి డొక్కా మాణిక్య వరప్రసాద్ను ఓడించారు.
3:52 PM IST:
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
3:49 PM IST:
ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్ధి కరణం బలరామ కృష్ణమూర్తి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి ఆమంచి కృష్ణమోహన్పై 12,600 ఓట్ల తేడాతో గెలుపొందారు.
4:07 PM IST:
జనసేన పార్టీకి ఎట్టకేలకు విజయం దక్కింది. రాజోలులో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ 3400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
3:44 PM IST:
హోంమంత్రి, టీడీపీ అభ్యర్ధి చినరాజప్ప పెద్దాపురంలో విజయం సాధించారు. ఆయనకు 3200 ఓట్ల మెజారిటీ వచ్చింది.
3:43 PM IST:
కృష్ణాజిల్లా అవనిగడ్డలో వైసీపీ అభ్యర్ధి సింహాద్రి రమేశ్ బాబు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
3:31 PM IST:
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 33,700 ఓట్ల మెజార్టీ వచ్చింది.
3:28 PM IST:
చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీనటి ఆర్కే రోజా విజయం సాధించారు. ఆమెకు 2,681 ఓట్ల ఆధిక్యం లభించింది.
3:20 PM IST:
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కలిశారు.
3:14 PM IST:
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నినాదాలతో పాటు.. బై బై బాబు అంటూ వైసీపీ కార్యకర్తలు కోలాహలం సృష్టించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.
3:10 PM IST:
కుప్పంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపొందారు.
2:28 PM IST:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. భీమవరంలో ఆయన స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
2:12 PM IST:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజలో ఉన్నారు. గాజువాక, భీమవరంలలో ఆయనపై వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో నిలిచారు.
2:07 PM IST:
కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. పెడనలో జోగీ రమేశ్, మచిలీపట్నంలో పేర్ని నాని గెలుపొందగా.. మరికొందరు ఆధిక్యంలో ఉన్నారు.
2:05 PM IST:
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పులివెందులలో టీడీపీ అభ్యర్ధి సతీశ్ రెడ్డి కంటే 55,700 ఓట్ల ఆధిక్యంలో జగన్ కొనసాగుతున్నారు.
1:52 PM IST:
గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ అభ్యర్ధి కిడారి శ్రవణ్ కంటే నోటాకు ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో అరకులో సెంటిమెంట్ వర్కవుట్ అవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు.
1:42 PM IST:
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ అభ్యర్ధి అమర్నాథ్ రెడ్డి. అపజయానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమన్నారు.
1:39 PM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం కట్టబెట్టినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని తాము ఊహించిందేనన్నారు.
ప్రజలు, దేవుడు పార్టీని ఆశీర్వదించారన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్రమోడీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడే తానేమీ మాట్లాడనని జగన్ వ్యాఖ్యానించారు.
1:32 PM IST:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో విజయాన్ని నమోదు చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం వైసీపీ అభ్యర్ధి జోగారావు విజయం సాధించారు.
1:25 PM IST:
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైసీపీ అభ్యర్ధి ఎలీజా గెలుపొందారు.
1:23 PM IST:
విజయనగరంలో వైసీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు.
1:20 PM IST:
ఎన్నికల అఖండ మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీ తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
1:11 PM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
1:05 PM IST:
ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్.. స్వయంగా జగన్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని కేసీఆర్ ఆకాంక్షించారు.
1:00 PM IST:
ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్ధి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావుపై 317 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
12:56 PM IST:
విశాఖజిల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప ఆధిక్యంలో నిలిచారు.
12:51 PM IST:
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల వెనుకంజలో ఉన్నారు.
12:48 PM IST:
మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 9 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
12:45 PM IST:
కౌంటింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా గుడివాడలో సల్వ ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ ఛైర్మన్పై కౌంటింగ్ కేంద్రం సమీపంలో కొందరు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును వేగంగా నడిపాడు.
12:30 PM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చతికిలపడింది.కేవలం 26 స్థానాల్లో మాత్రం సైకిల్ ఆధిక్యంలో ఉంది. కుప్పం, తాడికొండ, రేపల్లె, గుంటూరు వెస్ట్, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ సౌత్, పెద్దాపురం, రామచంద్రాపురం, ముమ్మిడివరం, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పర్చూరు, అద్దంకి, చీరాల, కందుకూరు, హిందూపురం, ఇచ్చాపురం, పాతపట్నం, తిరువూరు, కైకలూరు, విజయవాడ ఈస్ట్
12:23 PM IST:
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనుకంజలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్ధి మూడో స్థానంలో, టీడీపీ అభ్యర్ధి రెండో స్థానంలో ఉన్నారు.
12:12 PM IST:
ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సాయంత్రం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు.
12:03 PM IST:
విశాఖ నార్త్లో మంత్రి గంటా శ్రీనివాసరావు వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి కేకే రాజు 587 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
11:59 AM IST:
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్ కోడెలపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు 6,175 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
11:52 AM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారు కావడంతో జగన్... విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనంద సరస్వతితో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా స్వరూపనంద .. జగన్కు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీస్సులు అందజేశారు.
11:47 AM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. సాయంత్రం హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్కు ఆయన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.
11:42 AM IST:
ఈ నెల 25న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగే ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.
11:33 AM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో జగన్ ముఖ్యమంత్రి కల నెరవేరినట్లయ్యింది. ఈ నెల 30న వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
11:23 AM IST:
ఆంధ్రప్రదేశ్ లోక్సభ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో అధికారానికి చేరువైంది.
11:14 AM IST:
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు ఆధిక్యంలో నిలిచారు.
11:08 AM IST:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు కుమారులు వెనుకంజలో ఉన్నారు. పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ రాప్తాడులో వెనుకంజలో ఉన్నారు. అలాగే కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపై వైసీపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.
11:05 AM IST:
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ వెనుకంజలో ఉన్నారు.
11:02 AM IST:
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల శ్రీరామ్ వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
11:00 AM IST:
కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అత్యధిక స్ధానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పామర్రు, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పెడన, పెనమలూరు స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.
10:54 AM IST:
ఆంధ్రప్రదేశ్ లోక్సభ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో ముగినిపోయాయి. అమెరికా, ఆస్ట్రేలియాలలోని వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
10:49 AM IST:
పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వర్లు పనిచేయకపోవడంతో గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో నిలిచారు.
10:46 AM IST:
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్ధానాల్లో ఆధిక్యంలో నిలిచింది.
10:42 AM IST:
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో హోంమంత్రి చినరాజప్ప వెనుకంజలో నిలిచారు.
10:40 AM IST:
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్ధి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
10:38 AM IST:
సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. మొత్తం 14 స్ధానాల్లో 13 చోట్ల వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి, నగరిలో రోజా ముందంజలో ఉన్నారు.
10:33 AM IST:
ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి మేకపాటి శేఖర్ రెడ్డి రెండో రౌండ్ ముగిసేసరికి 3953 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
10:31 AM IST:
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ అభ్యర్ధి కొడాలి నాని.. టీడీపీ అభ్యర్ధి దేవినేని అవినాశ్పై 2600 ఓట్ల తేడాతో ఆధిక్యంలో నిలిచారు.
10:20 AM IST:
విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు వెనుకంజలో నిలిచారు.
10:15 AM IST:
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. టీడీపీ అభ్యర్ధి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి 1010 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
10:12 AM IST:
గుడివాడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని ముందంజలో నిలిచారు.
10:08 AM IST:
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెనుకంజలో నిలిచారు. ఆయనపై టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు ఆధిక్యంలో నిలిచారు.
10:02 AM IST:
మంగళగిరిలో మొదటి రౌండ్ ముగిసే సరికి మంత్రి నారా లోకేశ్పై వైసీపీ అభ్యర్ధి ఆర్కే 600 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు
9:54 AM IST:
ఏపీ అసెంబ్లీ తొలి రౌండ్లో మంత్రులు వెనుకంజలో నిలిచారు. సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు వెనుకంజలో నిలిచారు. వారిపై వైసీపీ కార్యకర్తలు ముందంజలో నిలిచారు.
9:51 AM IST:
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
9:48 AM IST:
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
9:42 AM IST:
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చారు.
9:39 AM IST:
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జనసేన అభ్యర్ధి పితాని బాలకృష్ణ ముందంజలో నిలిచారు. .
9:36 AM IST:
అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు, నందమూరి బాలకృష్ణ ముందంజలో నిలిచారు.
9:34 AM IST:
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెనుకంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి కె.చంద్రమౌళి స్వల్ప ఆధిక్యంలో నిలిచారు.
9:31 AM IST:
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ముందంజలో నిలిచారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి పేరాడ తిలక్ 1600 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
9:25 AM IST:
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరంలో పవన్ కల్యాణ్ వెనుకంజలో నిలిచారు.
9:23 AM IST:
గుంటూరు ఈస్ట్, వెస్ట్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో నిలిచింది.
9:20 AM IST:
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మంత్రి కళా వెంకట్రావ్ వెనుకంజలో నిలిచారు.
9:19 AM IST:
చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ మహిళా నేత రోజా ముందంజలో ఉన్నారు.
9:17 AM IST:
తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన ఆధిక్యంలో నిలిచింది
9:13 AM IST:
శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇప్పటి వరకు 10 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.
9:12 AM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
8:51 AM IST:
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మొదటి రౌండ్ ఫలితంలో వైసీపీ అభ్యర్ధి ముందంజలో నిలిచారు.
8:39 AM IST:
ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్ధి సురేశ్ ఆధిక్యంలో నిలిచారు.
8:38 AM IST:
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఆధిక్యంలో నిలిచారు.
8:36 AM IST:
అనంతపురం రూరల్, శింగనమల నియోజకవర్గాల్లో వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.
8:35 AM IST:
కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు.
8:34 AM IST:
నెల్లూరు సిటీలో వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
8:33 AM IST:
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ నేత, మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు.
8:31 AM IST:
శ్రీకాకుళం జిల్లా చీపురపల్లిలో వైసీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు.
8:29 AM IST:
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లో జగన్ పార్టీ ముందంజలో నిలిచింది.
8:23 AM IST:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. సీఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఏజెంట్లకు టిఫిన్ ఏర్పాట్లు చేయలేదంటూ వారు ఆందోళనకు దిగారు.
ఒక్కొక్క ఏజెంట్ నుంచి రూ.400 వసూలు చేసిన అధికారులు తమకు తగిన సౌకర్యాలు కల్పించలేదంటూ విమర్శించారు.
8:18 AM IST:
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లో ఫ్యాన్ ముందంజలో నిలిచింది.
8:09 AM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది.
7:56 AM IST:
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాడేపల్లిలోని తన జగన్ నివాసం నుంచే పర్యవేక్షించనున్నారు.
ఇందుకోసం బుధవారం సాయంత్రమే జగన్, ఆయన సతీమణి భారతితో కలిసి తాడేపల్లి చేరుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం ఉదయం తాడేపల్లికి రానున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని జగన్, ప్రశాంత్ కిశోర్లు అభ్యర్ధులు, నేతలతో సమీక్షించనున్నారు.
7:47 AM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఢిల్లీ, అమరావతిలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది.
సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో అందించడంతో పాటు కౌంటింగ్లో పొరపాట్లు, అవకతవకలు జరిగితే వెంటనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు నేతలను సిద్ధం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం తన నివాసం నుంచే కౌంటింగ్ను పర్యవేక్షించనున్నారు.
7:42 AM IST:
జగ్గంపేట, అమలాపురం, పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం అర్బన్, తుని, పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ
7:42 AM IST:
కొవ్వూరు, పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు, గుంటూరు తూర్పు, నెల్లూరు రూరల్, ప్రత్తిపాడు,, నగరి, అనపర్తి, పార్వతీపురం, మాడుగుల, విశాఖపట్నం దక్షిణం, విశాఖ పశ్చిమం, వేమూరు
7:41 AM IST:
ఏపీలో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ను ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకువచ్చే సిబ్బంది గులాబీ రంగు టీషర్ట్, పార్లమెంట్ ఈవీఎంలను తీసుకువచ్చే సిబ్బంది తెలుగు రంగు ఈవీఎంలను ధరిస్తారు. ఒకే కౌంటింగ్ కేంద్రంలో ఓ వైపు అసెంబ్లీ, మరోవైపు పార్లమెంటు లెక్కింపు చేపట్టడంతో ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా ఈసీ డ్రెస్ కోడ్ను ఏర్పాటు చేసింది.
ఉదయం స్ట్రాంగ్ రూమ్ తెరిచినప్పటి నుంచి చివరి రౌండ్ ముగిసేవరకు వీరు ఈ డ్రెస్లోనే ఉంటారు.
7:32 AM IST:
సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద సందడి నెలకొంది. సీఎంను కలిసేందుకు జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు వచ్చారు. అలాగే ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు గాను చంద్రబాబు నివాసంలోని మీడియా పాయింట్ వద్ద ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు.
7:26 AM IST:
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆరుగురు ఏజెంట్లపై ఆర్వో వేటు వేశారు. పలు క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఉన్న వైసీపీకి చెందిన ఐదుగురు, టీడీపీకి చెందిన ఒకరిని ఏజెంట్ విధుల నుంచి తొలగించారు.
7:23 AM IST:
ఎన్నికల సిబ్బందిపై తేనేటీగలు దాడి చేశాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ వద్ద వున్న లెండీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది, పోలీసులపై ప్రధాన ద్వారం కిటికీలకు ఆనుకుని వున్న తేనేటీగల గుంపు దాడి చేసింది. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి.
7:07 AM IST:
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీ శ్రేణులకు, కౌంటింగ్ ఏజెంట్లకు నియమించబడ్డ వారు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... పార్టీ నేతలు, కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడారు. కౌంటింగ్ చివరి క్షణం ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలని, ఎటువంటి అలసత్వం ప్రదర్శించాలని, పదుల సంఖ్యలో ఓట్ల తేడాతో విజయం దూరమయ్యే పరిస్ధితి రావచ్చునని అన్నారు.
వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపును ఏ శక్తి ఆపలేదని, అందరి శ్రమ, కార్యకర్తల పట్టుదల, కృషితో మరోసారి అధికారంలోకి రానున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
6:54 AM IST:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి వెల్లడయ్యే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల్లో ఫలితాలు ఆఖరున రానున్నాయి. నర్సాపురం పరిధిలో అతి తక్కువ పోలింగ్ కేంద్రాలుండటంతో కేవలం 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుంది.