ఏపీ ప్రభుత్వం డేటా చోరీ.. హైదరాబాద్ లో కేసు

Published : Mar 02, 2019, 02:38 PM IST
ఏపీ ప్రభుత్వం డేటా చోరీ.. హైదరాబాద్ లో కేసు

సారాంశం

ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా మొత్తం చోరికి గురైంది. 


ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా మొత్తం చోరికి గురైంది. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో ఉండటం గమనార్హం. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు సోదాలు చేపడుతున్నారు.

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీపై కేసు నమోదు చేసి, కూకట్‌పల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు ఆ కంపెనీలో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీకి చెందిన రెండు ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం