త్వరలో ఎన్నికలు.. మురళీ మోహన్ సంచలన నిర్ణయం

Published : Mar 01, 2019, 10:00 AM IST
త్వరలో ఎన్నికలు.. మురళీ మోహన్ సంచలన నిర్ణయం

సారాంశం

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎంపీ మురళీ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎంపీ మురళీ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తనతోపాటు.. తన కోడలిని కూడా పోటీ కి దూరంగా ఉంచాలని మురళీ మోహన్ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు ఈ విషయాన్ని ఈరోజు చంద్రబాబుకి తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక నుంచి తాను ఏర్పాటుచేసిన ట్రస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. అమరావతిలో శుక్రవారం రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్‌ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని సీఎంకు స్వయంగా తెలియజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu