ఇటీవల ప్రారంభం.. కూలిన ఏపీ హైకోర్టు గోడ

Published : Mar 02, 2019, 11:20 AM IST
ఇటీవల ప్రారంభం.. కూలిన ఏపీ హైకోర్టు గోడ

సారాంశం

ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. భవనం ప్రారంభించి.. కేవలం రెండు నెలలకే.. దాని పరిస్థితి అద్వాన్నంగా మారింది. జనరేటర్‌కు సంబంధించి నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్‌ కూలింది. 

ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు.  అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Kollu Ravindra: జువ్వలదిన్నె మత్స్యకారుల సమస్య పై రాష్ట్ర ప్రభుత్వ కమిటి సమావేశం | Asianet Telugu
నారా లోకేష్ గారి కృషితో ఆర్డీటీ సేవలు పునరుద్దరణ : మంత్రి సవిత| Asianet News Telugu