ఇటీవల ప్రారంభం.. కూలిన ఏపీ హైకోర్టు గోడ

Published : Mar 02, 2019, 11:20 AM IST
ఇటీవల ప్రారంభం.. కూలిన ఏపీ హైకోర్టు గోడ

సారాంశం

ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. భవనం ప్రారంభించి.. కేవలం రెండు నెలలకే.. దాని పరిస్థితి అద్వాన్నంగా మారింది. జనరేటర్‌కు సంబంధించి నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్‌ కూలింది. 

ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు.  అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పోలీస్ లాఠీ ఛార్జ్ | YS Jagan Srikakulam Tour | Asianet News Telugu
Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ