డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపదు.. ఉండవల్లి

Published : Mar 12, 2019, 02:36 PM IST
డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపదు.. ఉండవల్లి

సారాంశం

డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపించదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 


డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపించదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన కాకినాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డేటా దుర్వినియోగం చేయకపోతే... ఏపీ ప్రభుత్వం ఎందుకు అంత కంగారు పడుతోందని ప్రశ్నించారు.

డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపదని, ప్రభుత్వ పనితీరు చూసే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. టీడీపీ, వైసీపీ ఒకరిని ఒకరు దొంగలని తిట్టుకోవడం సరికాదన్నారు. జూన్‌లో పోలవరం నీళ్లు ఇవ్వడం అసాధ్యమని ఉండవల్లి అన్నారు. 

అలాగే ఏపీ ప్రభుత్వ డేటా చోరీపై వైసీపీ కేసు పెట్టడం తప్పుకాదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని బయటికి ఇవ్వడం నేరమన్నారు. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu