వైసీపీ ఖాతాలోకి మాచర్ల మున్సిపాలిటీ: 31 వార్డులూ ఫ్యాన్ గుప్పిట్లోకే

Siva Kodati |  
Published : Mar 13, 2020, 05:36 PM ISTUpdated : Mar 13, 2020, 05:44 PM IST
వైసీపీ ఖాతాలోకి మాచర్ల మున్సిపాలిటీ: 31 వార్డులూ ఫ్యాన్ గుప్పిట్లోకే

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. మొత్తం 31 వార్డులకు గాను 26 వార్డులకు కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలవ్వగా, మరో ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. మొత్తం 31 వార్డులకు గాను 26 వార్డులకు కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలవ్వగా, మరో ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.

ముందుజాగ్రత్తగా మరో ఆరు నామినేషన్లను వైసీపీ సానుభూతిపరులు వేశారు. రేపటితో విత్‌డ్రా గడువు ముగిసే సమయానికి మొత్తం 31 స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ఇక్కడ 5 జడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 1983లో మాచర్ల మున్సిపాలిటీ ఏర్పడి తర్వాత ఇప్పటి వరకు 31 స్థానాలను కైవసం చేసుకున్న ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ నిలవనుంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడలో రైతుల అకౌంట్ లోకి నేరుగా నిధులు జమ చేసిన పవన్| Asianet News Telugu