బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి, నోటికొచ్చినట్లు మాట్లాడితే మూతి పగలగొడతా: టీడీపీ నేతకు రోజా వార్నింగ్

Siva Kodati |  
Published : Feb 06, 2022, 09:55 PM IST
బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి, నోటికొచ్చినట్లు మాట్లాడితే మూతి పగలగొడతా: టీడీపీ నేతకు రోజా వార్నింగ్

సారాంశం

నగరిలో గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ దందాలో రోజాకు కూడా భాగం ఉందంటూ ఇటీవల గాలి భానుప్రకాశ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు వాగితే మూతి పగలగొడతా అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు

తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ నేత గాలి భానుప్రకాశ్‌పై (gali bhanu prakash) నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు వాగితే మూతి పగలగొడతా అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. నగరిలో గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ దందాలో రోజాకు కూడా భాగం ఉందంటూ ఇటీవల గాలి భానుప్రకాశ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి మట్టి అక్రమ రవాణాను అడ్డుకుంటే, రోజా మాత్రం మట్టి తరలింపునకు అండగా నిలుస్తున్నారని భాను ప్రకాశ్ ఆరోపించారు.

దీనిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను అక్రమంగా సంపాదిస్తున్నానని అంటున్నారని, కావాలంటే తన బ్యాంక్ బ్యాలెన్స్‌ను ప్రకటిస్తానని రోజా స్పష్టం చేశారు. తాను ప్రజల పక్షాన నిలిచే నేతనని .. ప్రజల మధ్యలో ఉంటానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా వెల్లడించారు. వైసీపీలో ఉన్న కొందరి సహకారంతో తనను ఓడించాలని భావిస్తే అది పగటి కలగానే మిగిలిపోతుందని ఆమె దుయ్యబట్టారు.

మరోవైపు చిత్తూరు (chittoor) జిల్లా నగరి (nagari) వైసీపీలో (ysrcp) ఆధిపత్యపోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రోజాకు (mla roja) ఆమె ప్రత్యర్ధి వర్గానికి మధ్య పోసగడం లేదు. తన అసమ్మతి వర్గానికి కీలక పదవులు దక్కడం... అధిష్టానానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై రోజా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా వైసీపీని వీడతారాంటూ ప్రచారం జరుగుతోంది. ఈ  క్రమంలో రోజా స్పందించారు. ఒక ఆడబిడ్డగా ఇక్కడే చావాలని డిసైడ్ అయినట్లు ఆమె స్పష్టం చేశారు. 

తాను రాజీనామా చేస్తానని.. పార్టీ మారతానని ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జగనన్న పార్టీ పెట్టకుముందు నుంచే ఆయన వెంట వున్నానని ఆమె గుర్తుచేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. పోరాటాలు చేశానని రోజా పేర్కొన్నారు. తప్పు చేసినవాళ్లే పార్టీ నుంచి వెళ్తారు తప్పించి... జగన్‌ను ప్రేమించే తాము కాదని ఆమె తెలిపారు. పార్టీ మారాల్సిన  అవసరం తనకు లేదని.. అందరూ పల్లె నుంచి పట్నంలో ఇల్లు కట్టుకుంటే.. తాను నగరిలో కట్టుకున్నానని రోజా పేర్కొన్నారు. ప్రజల కష్టాన్ని వినాలని.. అవి తీర్చాలని ఆమె సూచించారు. 

నగరిలో ఎమ్మెల్యే రోజాకు చక్రపాణిరెడ్డి (chakrapani reddy) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరూ బాహాటంగానే వాదులాడుకున్నారు. నగరిలో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని చక్రపాణి రెడ్డిపై రోజా ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా చక్రపాణి రెడ్డిని శ్రీశైల ఆలయ బోర్డు చైర్మన్‌గా అవకాశం కల్పించడం రోజా కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. అంతేకాదు.. గతంలో రోజాకు గట్టి ప్రత్యర్థి అయిన నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కెజి కుమార్, ఆయన భార్య శాంతికి ఈడిగ కుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం . ఆ సమయంలోనే రోజా తీవ్ర అసహనానికి గురయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu