నంద్యాల జిల్లాలో బీజేపీ నేత ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి.. పోలీసులకు ఫిర్యాదు..!

Published : Jan 19, 2023, 03:07 PM IST
నంద్యాల జిల్లాలో బీజేపీ నేత ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి.. పోలీసులకు ఫిర్యాదు..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లెలోని కొండపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేత శరత్‌చంద్ర ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లెలోని కొండపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేత శరత్‌చంద్ర ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. శరత్‌చంద్రతో పాటు తల్లి సుకన్యపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. శరత్‌చంద్ర ఇల్లు తమదేనంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. శరత్ చంద్ర కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నీచర్ బయటపడేసి శరత్ చంద్ర ఉంటున్న ఇంటికి వైసీపీ కార్యకర్తలు తాళం వేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై శరత్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే