వైఎస్ వివేకా అంత్యక్రియలు పూర్తి

Published : Mar 16, 2019, 11:48 AM IST
వైఎస్ వివేకా అంత్యక్రియలు పూర్తి

సారాంశం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య  వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య  వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పులింవెందుల లోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో శనివారం ఉదయం 11 గంటల ప్రాంత్రంలో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

జగన్, విజయమ్మ, కుటుంబసభ్యులందరూ.. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అభిమాన నేతలను కడసారి వీక్షించేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకముందు జరిగిన అంతిమ యాత్రలో కూడా జగన్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu