రేపు బీసీ కార్పోరేషన్లకు నామినేటెడ్ పోస్టుల ప్రకటన

Siva Kodati |  
Published : Sep 29, 2020, 08:17 PM ISTUpdated : Sep 29, 2020, 08:18 PM IST
రేపు బీసీ కార్పోరేషన్లకు నామినేటెడ్ పోస్టుల ప్రకటన

సారాంశం

ఏపీ బీసీ కార్పోరేషన్లకు రేపు నామినేటెడ్ పోస్టులు ప్రకటించనున్నారు. తొలిసారిగా భారీ మొత్తంలో బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కులాల ఆర్ధిక, సామాజిక ప్రగతికి తోడ్పాటు అందించేందుకు మొత్తం 56 కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు

ఏపీ బీసీ కార్పోరేషన్లకు రేపు నామినేటెడ్ పోస్టులు ప్రకటించనున్నారు. తొలిసారిగా భారీ మొత్తంలో బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కులాల ఆర్ధిక, సామాజిక ప్రగతికి తోడ్పాటు అందించేందుకు మొత్తం 56 కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు.

అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగ వంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకు కూడా కార్పోరేషన్లు ఏర్పాటయ్యాయి. 30 వేలకు పైగా జనాభా వున్న బీసీ కులాలు అన్నింటికి కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పురుషుల కన్నా మహిళలకు ఎక్కువగా ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్మన్ పోస్టులు ఇస్తున్నారు. డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy: చరిత్రహీనులకు ప్రజలే చరమగీతం పాడుతారు: పార్థసారథి| Asianet Telugu
పూరీల మెషిన్ కోసం స్పాట్ లోనే డబ్బులు ఇచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu