మైనర్ బాలికను కొడుకు గదిలోకి బలవంతంగా పంపి...

Published : Aug 18, 2020, 09:12 AM ISTUpdated : Aug 18, 2020, 09:19 AM IST
మైనర్ బాలికను కొడుకు గదిలోకి బలవంతంగా పంపి...

సారాంశం

 కొడుకు ఓ మైనర్ బాలికపై కన్నేస్తే.. అతనికి ఆ విషయంలో సహకరించింది. బాలికను ఆమె తీసుకువచ్చి బలవంతంగా కొడుకు గదిలోకి పింపింది. 

కొడుకు తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన తల్లే.. పెడదారి పట్టింది. కొడుకు చేస్తున్న తప్పుకి ఆమె పూర్తిగా సహకరించింది. ఓ ఆడపిల్ల జీవితాన్ని స్వయంగా తన చేతులతో నాశనం చేసింది. కొడుకు ఓ మైనర్ బాలికపై కన్నేస్తే.. అతనికి ఆ విషయంలో సహకరించింది. బాలికను ఆమె తీసుకువచ్చి బలవంతంగా కొడుకు గదిలోకి పింపింది.  ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

వినుకొండకు చెందిన మాదవరపు గోపినాథ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ఇదే విషయాన్ని కన్న తల్లికి చెప్పగా.. ఆమె తప్పు అని వారించాల్సింది పోయి.. పూర్తిగా సహకరించింది. తన తల్లి ప్రోద్బలంతో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

మాదవరపు గోపినాథ్ వయసు 22ఏళ్లు కాగా.. సదరు బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది.బలవంతంగా బాలికను తన ఇంటికి తీసుకువచ్చి మరీ  అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ హెచ్చరించారు. కాగా.. బాధితురాలు తన కటుంబసభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. అయితే, గోపినాథ్ తల్లే బాధిత బాలికను బలవంతంగా గదిలోకి పంపినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు గోపినాథ్, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

కాపు నేత ముద్రగడ.. రెడ్డిగా ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా.? పవన్ కారణమని తెలుసా?
ఆ యాక్సిడెంట్ చేసిందిసీదిరి అప్పల్రాజు కొడుకే: గౌతు శిరీష | Palasa MLA Gouthu Sireesha