ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు.దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు.
ప్రేమికుల మధ్య కోడి పకోడి చిచ్చు రేపింది. ప్రియుడు ఎంతో ప్రేమగా... కోడి పకోడి తీసుకువస్తే... ప్రియురాలు తినలేదు. దీంతో... మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను(25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను, ఆమె ఈనెల 19న మచిలీపట్నం వెళ్లివచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడిపకోడి తెచ్చుకున్నాడు. ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు.
దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆమె తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.