టీడీపీ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూత

Siva Kodati |  
Published : Aug 21, 2019, 09:39 AM IST
టీడీపీ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూత

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురవ్వడంతో బ్రహ్మయ్యను కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఆయన మార్గమధ్యంలోనే కన్నుమూశారు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురవ్వడంతో బ్రహ్మయ్యను కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఆయన మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆయన ఒకసారి గుండెపోటుకు గురయ్యారు. ఫిబ్రవరిలో రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయనకు గుండెపోటు రావడంతో బ్రహ్మయ్యను రమేశ్ హాస్పిటల్‌కు తరలించారు.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి 1994, 1999లో బ్రహ్మయ్య వరుసగా రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Srikakulam Collector సుడిగాలి పర్యటన.. పరుగులు పెట్టిన షాపుల యజమానులు | Asianet News Telugu
AP Food Commission Visits:ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..డీలర్లకు కీలక ఆదేశాలు | Asianet News Telugu