ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి...

Published : Jan 08, 2022, 10:22 AM IST
ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి...

సారాంశం

ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండు మూడు రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో parents బాలికను గట్టిగా మందలించారు. దీంతో బాలిక అసలు విషయాన్ని బయటపెట్టింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

పశ్చిమ గోదావరి : రోజురోజుకూ పసికందులమీద అత్యాచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. సొంతవారు, బాగా తెలిసినవారు, చుట్టుపక్కలవారు, పరిచయస్తులు.. కన్న తండ్రులు.. ఇలా ప్రతీ ఒక్కరూ ముద్దులొలికే చిన్నారుల మీద ప్రేమ కురిపించాల్సింది పోయి.. కామంతో కళ్లు మూసుకుపోయి.. కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరిస్తున్నారు. 

ఓ చోట ఐదేళ్ల చిన్నారిని చిదిమేయడానికి ఓ కామాంధుడు ప్రయత్నిస్తే.. మరోచోట 16 నెలల పసిగుడ్డును కన్నతండ్రే పాశవికంగా లైంగికదాడి చేసి హత్య చేశాడు. దీనికి నవమాసాలూ మోసి కన్న తల్లే సహకరించడం విషాదం. ఈ విషాద ఘటనలోకి వెడితే....

West Godavari జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 
Five-year-old girlపై ఓ యువకుడు molestation చేశాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండు మూడు రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో parents బాలికను గట్టిగా మందలించారు. దీంతో బాలిక అసలు విషయాన్ని బయటపెట్టింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

16 నెలల పసికందుపై own father అత్యంత పాశవికంగా molestation చేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నవమాసాలూ మోసి జన్మనిచ్చిన కన్నతల్లే దీనికి సహకరించడం. ఆ తరువాత చిన్నారిని దారుణంగా చంపేసి, dead bodyని మాయం చేయబోయారు.. కానీ పట్టుబడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరగగా పూణేలో అరెస్ట్ అయ్యారు. 

ముక్కుపచ్చలారని 16 నెలల పసికందుపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కనికరం లేకుండా గొంతు నులిమి murder చేశాడు. ఈ ఘాతుకానికి పసిగుడ్డు mother సహకరించడం అమ్మతనానికే మాయని మచ్చ.. చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తరలించేందుకు రైలెక్కగా  ప్రయాణికుల అనుమానంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితులు గుజరాత్లోని రాజ్కోట్లో వెళ్తుండగా.. మహారాష్ట్రలోని షోలాపూర్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ్కోట్ కు చెందిన దంపతులు సికింద్రాబాద్ లోఉంటున్నారు. కన్నకూతురిపై  తండ్రి (26) ఈ నెల 3న ఇంట్లో లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించింది. తాము చేసిన ఘోరం మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు వారు మృతదేహాన్ని రాజ్ కోట్ కి తీసుకెళ్లాలని భావించారు.  సికింద్రాబాదులో రాజ్ కోట్ రైలెక్కారు. అయితే ఎంతసేపయినా పాపలో చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు విషయాన్ని టీటీఈకి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... సోలాపూర్ లో వారిని దింపేసారు.  పోక్సో సహా పలు సెక్షన్ల కింద దంపతులపై కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Revenue Minister Anagani Satya Prasad Key Comments at Collectors Conference | Asianet News Telugu
Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో భట్టివిక్రమార్క కుటుంబం | Deputy CM | Asianet News Telugu