ఏలేశ్వరం కిడ్నాప్ కేసు: తీవ్రగాయాలతో, అపస్మారక స్థితిలో దొరికిన బాలుడు

Siva Kodati |  
Published : Aug 09, 2019, 10:21 AM IST
ఏలేశ్వరం కిడ్నాప్ కేసు: తీవ్రగాయాలతో, అపస్మారక స్థితిలో దొరికిన బాలుడు

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్ ఆచూకీ లభించింది. స్థానిక డిగ్రీ కాలేజీ వెనుక బాలుడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడివుండటాన్ని పోలీసులు గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్ ఆచూకీ లభించింది. స్థానిక డిగ్రీ కాలేజీ వెనుక బాలుడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడివుండటాన్ని పోలీసులు గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఎర్రవరానికి చెందిన తోట ధనుష్ ఏలేశ్వరంలోని శ్రీవిద్యా స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్‌కు వెళ్లిన ధనుష్ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లీదండ్రులు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ
రెడ్డప్పగారి మాధవి స్పీచ్ కి చంద్రబాబు లేచి మరీ చప్పట్లు Reddappagari Madhavi | Asianet News Telugu