‘మేము ధర్నా చేశాం కాబట్టే.. ఈ రోజు మీరు ఆ పాపని పరామర్శించారు’

Published : May 05, 2018, 02:27 PM IST
‘మేము ధర్నా చేశాం కాబట్టే.. ఈ రోజు మీరు ఆ పాపని పరామర్శించారు’

సారాంశం

చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ రోజా

సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకనేందుకు ప్రతిపక్ష పార్టీ ని ఎత్తిచూపుతున్నారన్నారు. దాచేపల్లి నిందితుడు టీడీపీకి చెందినవాడేనని.. అందుకు తమ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. కానీ.. సిగ్గులేకుండా చంద్రబాబు.. అతను వైసీపీ వాడని చెబుతున్నారన్నారు.

గడిచిన నాలుగేళ్లలో ఏపీలో చాలా మంది చిన్నారులు  అత్యాచారానికి గురయ్యారన్నారు. ఏ అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లనిది.. కేవలం  ఈ దాచేపల్లి బాధితురాలి ఇంటికి మాత్రమే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ ఒక్క పాపనే  ఎందుకు చదివిస్తామని చెప్పారని అడిగారు. ఎందుకంటే.. తాను, తన పార్టీ  మహిళా నేతలు బాధిత చిన్నారికి న్యాయం చేయాలని  ధర్నా చేశామని.. అందుకే సీఎం దిగివచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆమె అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu