భర్త ఇంటిముందు భార్య మృతదేహం పూడ్చివేత... వైసీపీ నాయకుల అండతో అరాచకం...

By SumaBala BukkaFirst Published Oct 31, 2023, 6:46 AM IST
Highlights

భార్యమృతదేహాన్ని భర్త ఇంటిముందు పూడ్చారు బంధువులు. ఆమె చనిపోయినా చూడడానికి రాలేదని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

కుప్పం : ఆంధ్రప్రదేశ్లో ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి ఇంటి ముందు అతని భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టారు వైసిపి నాయకులు. రెండో భార్య చనిపోతే కడసారి చూపుకు కూడా ఆ భర్త రాలేదని ఆగ్రహించి ఈ పనికి పూనుకున్నారు. భర్త ఇంటి ముందు మృతదేహాన్ని పూడ్చిపెట్టి, ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదివారం ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ సింగారపురంలో చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు వెలుగులోకి వచ్చింది.

తన ఇంటి ముందు భార్య మృతదేహాన్ని పూడ్చి పెట్టడం, ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేయడంతో సోమవారం బాధితుడు  కుప్పం పోలీసులను ఆశ్రయించాడు. న్యాయం కోసం అతను పోలీస్ స్టేషన్ కి రావడంతో విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. సింగారపురం గ్రామానికి చెందిన చెన్నయ్యన్ కు ఇద్దరు భార్యలు. రెండో భార్య రత్నమ్మ కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇటీవల అనారోగ్యం బారిన పడిన రత్నమ్మ శనివారం నాడు మృతి చెందింది.

TDP: నవంబర్ 1 నుంచి ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి యాత్ర'

అయితే, భార్య చనిపోయిందన్న సమాచారం ఇచ్చినప్పటికీ చెన్నయ్యన్ ఆమెను చూసేందుకు వెళ్లలేదు. దీంతో మృతురాలి బంధువులు తీవ్రంగా ఆగ్రహించారు. మృతురాలు బంధువులు స్థానిక ప్రజా ప్రతినిధిగా ఉన్న వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్లారు. విషయం చెప్పారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి బంధువులంతా ఆదివారం ఆమె మృతదేహాన్ని భర్త ఇంటి ముందు పూడ్చి పెట్టారు. ఆ తర్వాత చెన్నయ్యన్ ఇంట్లోకి దూరి మొత్తం విధ్వంసం సృష్టించారు. 

అయితే, ఇదంతా జరుగుతున్న సమయంలో చెన్నయ్యన్ ఇంట్లో లేడు. అతనికి సమాచారం తెలియడంతో సోమవారం కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. 

click me!