
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషాద ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలని కోరింది.