ఇద్దరు పిల్లలతో బ్యాంకుకు వచ్చి.. డబ్బులు కాజేసీ పరారయ్యింది..

Published : Sep 30, 2021, 04:38 PM IST
ఇద్దరు పిల్లలతో బ్యాంకుకు వచ్చి.. డబ్బులు కాజేసీ పరారయ్యింది..

సారాంశం

ఈ క్రమంలో బ్యాంక్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిమీద గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

కృష్ణా జిల్లా : గన్నవరం ఆంధ్రాబ్యాంక్ (Gannavaram Andhra Bank)లో భారీ చోరీ (Thieft)జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్ కు వచ్చిన ఒక మహిళ(Lady).. మరో మహిళ బ్యాగ్ లో నుంచి రూ.65 వేల రూపాయలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడి నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్ లో డబ్బులు కన్నించకపోవడంతో కంగారుగా వెతికింది. 

ఈ క్రమంలో బ్యాంక్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిమీద గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. లోకం తెలియని ఆ పసికందుకు కర్కశంగా గొంతు నులిచి చంపేశాడు. 

తోలు తీయించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు: పవన్‌పై ఏపీ హోంమంత్రి ఫైర్

ఈ సంఘటన క్రిష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. నాలుగు నెలల పసికందుకు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతునులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడి గట్టాడా? లేదా స్థల వివాదాలు కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రెడ్డిగూడెం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu