తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 10, 2020, 10:33 AM ISTUpdated : Oct 10, 2020, 10:49 AM IST
తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

సారాంశం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో స్పష్టమైన అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికల్లా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా. ఆ వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈనెల 12 ఉదయం నాటికి ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటుతుంది.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో స్పష్టమైన అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికల్లా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా.
ఆ వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈనెల 12 ఉదయం నాటికి ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటుతుంది.

దీని ప్రభావం తెలుగురాష్ట్రాల మీద రేపు ఎల్లుండీ అత్యధికంగా ఉంటుంది. ఈ రోజు శనివారం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమల్లో తేలికపాటినుంచీ ఓ మోస్తరు వర్షం పడుతుంది. కోస్తాంధ్ర తెలంగాణల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ వాయుగుండం ప్రభావం తమిళనాడు కర్నాటక మహారాష్ట్రలమీద కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎగువ రాష్ట్రాల్లోని వర్షాలకు మరోసారి కృష్ణ గోదావరులకు వరద ప్రవాహాలు పెరగవచ్చని అంచనా.

తీరప్రాంత మత్స్యకారులు నేడు, రేపు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. లోతట్టు సముద్రంలోకి పోవద్దని సూచిస్తున్నారు. ఆదివారం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వేటకు వెళ్లవద్దని హెచ్చిరిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే