జయదేవ్ కనిపించడం లేదన్న వైసీపీ.. టీడీపీ కౌంటర్, గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస

Siva Kodati |  
Published : Feb 17, 2023, 03:15 PM IST
జయదేవ్ కనిపించడం లేదన్న వైసీపీ.. టీడీపీ కౌంటర్, గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస

సారాంశం

గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం రసాభాసగా మారింది. ఎంపీ జయదేవ్ కనబడుటం లేదని సభ్యులు ఆరోపించారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్పోరేటర్ల మధ్య ఘర్షణ జరిగింది.

గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం రసాభాసగా మారింది. వార్డుల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మరోవైపు గుంటూరు ఎంపీ కనబడటం లేదని కౌన్సిల్‌లో వైసీపీ కార్పోరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన ఎంపీ జయదేవ్ కనబడుటం లేదని సభ్యులు ఆరోపించారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్పోరేటర్ల మధ్య ఘర్షణ జరిగింది. సభ్యుల నిరసనల మధ్యే కౌన్సిల్‌ను వాయిదా వేశారు మేయర్ కావటి మనోహర్. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu