ఏపీలో వీఆర్ఏల వేతనం పెంపు

Published : Jun 11, 2018, 06:20 PM IST
ఏపీలో వీఆర్ఏల వేతనం పెంపు

సారాంశం

ఏపీలో వీఆర్ఏల వేతనం పెంపు

వీఆర్ఏల వేతనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది.. ఇప్పటి వరకు నెలకు రూ.6 వేలుగా ఉన్న వేతనాన్ని రూ.10,500లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు ఈ నెల 2 నుంచి అమల్లోకి రానున్నాయి. చాలీచాలనీ జీతాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీఆర్ఏ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు మొర పెట్టుకోవడంతో.. స్పందించిన ఆయన వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు.. సీఎం ఆదేశాల మేరకు ఇవాళ వేతనాలు పెంచుతూ జీవో విడుదలయ్యింది.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu