భేష్... కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చించిన ఎమ్మార్వో...

Published : Feb 25, 2021, 01:56 PM IST
భేష్... కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చించిన ఎమ్మార్వో...

సారాంశం

చెప్పడం కాదు చేసి చూపించాలి అనేదానికి నిదర్శనంగా నిలిచారు ఓ తహశీల్దార్. స్వయంగా తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సామాన్యజనానికి ప్రభుత్వ పాఠశాలలమీద నమ్మకాన్ని పెంచారు. 

చెప్పడం కాదు చేసి చూపించాలి అనేదానికి నిదర్శనంగా నిలిచారు ఓ తహశీల్దార్. స్వయంగా తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సామాన్యజనానికి ప్రభుత్వ పాఠశాలలమీద నమ్మకాన్ని పెంచారు. 

కృష్ణాజిల్లా విస్సన్నపేట తహశీల్దార్ మురళీకృష్ణ కుమార్తె సంజన. ఈ చిన్నారి గతేడాది ఓ టెక్నో స్కూలులో ఒకటో తరగతి చదువుకుంది. ప్రస్తుతం ఈ చిన్నారి రెండో తరగతిలో ప్రభుత్వ పాటశాలలో చేరింది. 

మురళీకృష్ణ స్వయంగా కూతురిని కారులో తీసుకువచ్చి ఎంపీయూపీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. తహశీల్దార్ నిర్ణయంపై స్కూలు టీచర్లు ప్రశంసలు కురిపించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా తహశీల్దార్ ను అభినందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో భట్టివిక్రమార్క కుటుంబం | Deputy CM | Asianet News Telugu
ఈరెండు హాస్పిటళ్ళ అభివృద్దికి 5 కోట్లు | Pemmasani Speech | Medical Equipments | Asianet News Telugu