వారాహి విజయయాత్ర .. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, జనసేన పార్టీకి విశాఖ పోలీసుల నోటీసులు

Siva Kodati |  
Published : Aug 11, 2023, 04:01 PM ISTUpdated : Aug 11, 2023, 04:12 PM IST
వారాహి విజయయాత్ర ..  రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, జనసేన పార్టీకి విశాఖ పోలీసుల నోటీసులు

సారాంశం

జనసేన పార్టీకి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు జారీ చేశారు

జనసేన పార్టీకి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 30 కింద జనసేనకు నోటీసులు జారీ చేశారు. బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని పోలీసులు హెచ్చరించారు. జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావుకు నోటీసులు అందజేశారు. బహిరంగ సభల్లో జాగ్రత్త వహించాలని , లేకపోతే నిర్వాహకులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu