వారాహి విజయయాత్ర .. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, జనసేన పార్టీకి విశాఖ పోలీసుల నోటీసులు

Siva Kodati |  
Published : Aug 11, 2023, 04:01 PM ISTUpdated : Aug 11, 2023, 04:12 PM IST
వారాహి విజయయాత్ర ..  రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, జనసేన పార్టీకి విశాఖ పోలీసుల నోటీసులు

సారాంశం

జనసేన పార్టీకి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు జారీ చేశారు

జనసేన పార్టీకి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 30 కింద జనసేనకు నోటీసులు జారీ చేశారు. బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని పోలీసులు హెచ్చరించారు. జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావుకు నోటీసులు అందజేశారు. బహిరంగ సభల్లో జాగ్రత్త వహించాలని , లేకపోతే నిర్వాహకులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం