ఆటలో అరటిపండు.. జగన్ ను ఓడిస్తాడా?: పవన్ పై రోజా సెటైర్లు

Published : Aug 11, 2023, 03:18 PM ISTUpdated : Aug 11, 2023, 04:12 PM IST
ఆటలో అరటిపండు.. జగన్ ను ఓడిస్తాడా?: పవన్ పై రోజా సెటైర్లు

సారాంశం

పవన్ కళ్యాణ్ పై  ఏపీ మంత్రి రోజా  సెటైర్లు వేశారు.  చంద్రబాబు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ నడుచుకుంటాడన్నారు.

అమరావతి: ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ జగన్ ను ఓఆడిస్తాడా అని ఏపీ మంత్రి రోజా  సెటైర్లు వేశారు.శుక్రవారం నాడు  కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో ఆమె మీడియాతో మాట్లాడారు. వారాహి యాత్రలో భాగంగా విశాఖపట్టణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిన్న తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలకు  మంత్రి రోజా కౌంటరిచ్చారు.చంద్రబాబు అరవమంటే అరుస్తాడు, కరవమంటే కరుస్తాడన్నారు.చంద్రబాబు ఆటలో  పవన్ కళ్యాణ్ అరటి పండు  అన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ జగన్ ను ఓడిస్తాడా, ఆడిస్తాడా అని ఆమె ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ కు  ఓ జెండా ఎజెండా లేదని ఆమె చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవడమే పవన్ కళ్యాణ్ పని అని ఆమె ఎద్దేవా చేశారు.  చంద్రబాబు సింహాం అయితే వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయాలని మంత్రి సవాల్ విసిరారు.

దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీనే జగన్మోహనరెడ్డిని ఏమీ చేయలేకపోయారని ఆమె గుర్తు చేశారు. తన సినిమా నాలుగు ఆటలు కూడా ఆడించుకోలేని పవన్ కళ్యాణ్ జగన్ ను ఆటాడిస్తా అంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్త పుత్రుడు, ఉత్త పుత్రుడు రాష్ట్రంలో మూడు వైపులా తిరుగుతున్నారని సెటైర్లు వేశారు. వీరంతా రాష్ట్రంలో ఎన్ని పర్యటనలు చేసినా జగన్ వెంటే జనం ఉన్నారని ఆమె  చెప్పారు. వీళ్ళు ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రజలు జగనన్నతోనే ఉన్నారని మంత్రి రోజా అన్నారు.

also read:విధానం, సిద్దాంతం లేదు:పవన్ కళ్యాణ్ కు గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్

సినిమాలో  రీమేక్ సినిమాలను  విజయవంతం  చేస్తారేమోనన్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం రీమేక్  ప్రసంగాలను  ప్రజలను పట్టించుకోరని మంత్రి  రోజా చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీని, ఆయన కుటుంబాన్ని దూషించిన టీడీపీతో అంటకాగడాన్ని ఆమె తప్పుబట్టారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Women’s Cricket Team Members Visit Narasimha Swamy Temple in Vizag | Asianet News Telugu
Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu