విజ‌య‌వాడ దుర్గగుడి ద‌స‌రా ఉత్స‌వాలు: మునుపెన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ

Google News Follow Us

సారాంశం

Vijayawada: విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఎస్‌డిఎంఎస్‌డి)లో ప్రధాన వార్షిక ఉత్సవాలైన‌ దసరా వేడుక‌లు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనలతో 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 9 గంటల తర్వాత అన్ని పూజలు ముగించుకుని భక్తులను శ్రీ కనకదుర్గా దర్శనానికి అనుమతించారు. 
 

Sri Durga Malleswara Swamy Varla Devasthanam: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజున శ్రీ కనకదుర్గా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. బాల త్రిపురా త్రిపుర త్రయలో మొదటి దేవత, శ్రీ యంత్రంలోని అన్నింటికి ప్రధాన దేవతగా హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి.

ఆలయ అర్చకులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 8.30 గంటల మధ్య సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్య అర్చన వంటి సంప్రదాయ ఆచారాలతో 9 రోజుల వేడుకలు ప్రారంభమయ్యాయి. అన్ని పూజలు పూర్తయిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి శ్రీబాలా త్రిపుర సుందరి దేవి దర్శనానికి భక్తులను అనుమతించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన జీవిత భాగస్వామితో కలిసి వేడుకలను ప్రారంభించారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.

జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఇఓ కెఎస్ రామారావు, ఎమ్మెల్యే వి శ్రీనివాసరావు తదితరులు గవర్నర్ వెంట ఉన్నారు. కాగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దసరా వేడుక‌ల‌ మొదటి రోజున దుర్గా ఆలయాన్ని సందర్శించేందుకు రికార్డు స్థాయిలో యాత్రికులు వచ్చారు. ఇంత‌కుముందు ఎన్న‌డూలేని విధంగా పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చార‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Read more Articles on