కావలిలో మహిళ గొంతు కోసి హత్య చేసిన దుండగులు

Published : Aug 27, 2020, 01:36 PM IST
కావలిలో మహిళ గొంతు కోసి హత్య చేసిన దుండగులు

సారాంశం

 నెల్లూరు జిల్లా కావలిలో గురువారం నాడు ఉదయం షకీలా అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన కావలిలో కలకలం రేపింది.  


నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో గురువారం నాడు ఉదయం షకీలా అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన కావలిలో కలకలం రేపింది.

కావలిలోని ఓ కాలనీలో షకీలా అనే మహిళ నివాసం ఉంటుంది. భర్తతో గొడవల కారణంగా ఆమె భర్తకు దూరంగా విడిగా ఉంటుంది. కావలిలోనే వస్త్ర దుకాణంలో ఆమె పనిచేస్తోంది. పుచ్చలవారి వీధిలో ఆమె తరచూ ఒకరి ఇంటికి వెళ్లేది. ఆమె రాకపోకలపై నిఘా వేసిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవాళ ఉదయం కూడ షకీలా పుచ్చలవారి వీధిలోని ఓ ఇంటికి వెళ్లింది. అక్కడే మాటు వేసిన ఓ దుండగుడు ఆమెతో గొడవకు దిగాడు. తనతో తెచ్చుకొన్న కత్తితో దుండగుడు ఆమె గొంతు కోశాడు.  

తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.షకీలాకు తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడ్డారా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే